Hail rain: ఆ జిల్లాల్లో వడగళ్ల వాన! ఆందోళనలో రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hail rain: తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. భారీ వర్షం, ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. నేడు, రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షాలు కురిసే సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. విదర్భ పశ్చిమ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు 1500 మీటర్ల ఎత్తులో గాలులతో ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, భారతదేశంలోని దక్షిణ మరియు ఆగ్నేయ ప్రాంతాల నుండి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
Read also: HAIR TIPS: చుండ్రు సమస్యను చిటికెలో మాయం చేసే పిండి ఇదే..!
Also Read
ఈరోజు, రేపు హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో సగటున 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, మహబూబ్ నగర్ హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. పలుచోట్ల వడగళ్ల వాన కురుస్తుందని అధికారులు తెలిపారు.
బుధవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిన్న రాష్ట్రంలో సగటున 2.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. . సాధారణంగా వర్షాకాలంలో ఈ తరహా వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో, వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో 9 సెంటీమీటర్లు, భువనగిరిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వడగళ్ల వానతో రాష్ట్రంలో భారీ పంట నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్నతో పాటు బత్తాయి, మామిడి, నిమ్మ వంటి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం రాళ్లలో తడిసిపోయింది. పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తుండటంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Uppal skywalk: ఉప్పల్ స్కైవాక్ ప్రారంభానికి సిద్ధం.. ప్రత్యేకతలివే
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!