Gutha Sukender reddy: ప్రభుత్వ కార్యక్రమంతో బండికి ఏం సంబంధం? ఎలా హాజరవుతారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gutha Sukender reddy: ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన బీజేపీ కార్యక్రమం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఏం సంబంధం, ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ప్రధాని ప్రసంగం మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టడానికే పరిమితమైందన్నారు. నల్గొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పై బీజేపీ ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తోందని, ముఖ్యమంత్రిని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాద్-విజయవాడ హైవేను మూడేళ్ల కిందటే ఆరు లేన్లుగా చేయాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. ఏహెచ్ 65 నుంచి 565 హైవేను అనుసంధానం చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో నల్గొండ-మాచర్ల రైల్వే లైన్ను కేటాయించారని, కానీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వీటన్నింటిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మాట్లాడడం లేదని విమర్శించారు. రామభజన, ధరల పెంపు తప్ప బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
Read also: Jana Reddy: యశోద ఆస్పత్రిలో చేరిన జానారెడ్డి.. స్టంట్ వేసిన వైద్యులు
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
మంత్రి కేటీఆర్ను ప్రతిపక్షాలు టార్గెట్ చేయడం దుర్మార్గమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్లమెంట్లో మాట్లాడి ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేసి హైదరాబాద్ను బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను కాపాడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రతిపక్షాలు నిత్యం ప్రయత్నిస్తున్నాయన్నారు. వారికి అధికార యావ తప్ప మరేమీ లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ విఫలమైందన్నారు. ఆ పార్టీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. సీబీఐ, ఈడీ కేసుల మాఫీ కోసమే ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ కేంద్ర సంస్థలను, ప్రతిపక్ష పార్టీలను, రాష్ట్రాలను అడ్డం పెట్టుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పక్కన పెట్టడం తగదన్నారు. గవర్నర్లు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకూడదనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.
SSC Paper Leak : బండితో మాట్లాడింది 40 సెకెండ్లే.. ఏ2 నిందితుడు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!