SSC Paper Leak : బండితో మాట్లాడింది 40 సెకెండ్లే.. ఏ2 నిందితుడు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC Paper Leak: తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టయి కరీంనగర్ జైలులో ఉన్న నిందితులు బెయిల్పై ఇవాల విడుదలయ్యారు. A2 – ప్రశాంత్, A3 – మహేష్, A4 – గణేష్ ఈరోజు ఉదయం విడుదలయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మీడియాతో మాట్లాడారు. 10వ హిందీ ప్రశ్నపత్రం బయటకు రాగానే జర్నలిస్టుల బృందంలో జర్నలిస్టుగా పంచుకున్నానని ప్రశాంత్ చెప్పాడు. ఆ గ్రూపుల్లో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో తానేమీ తప్పు చేయలేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాడతానని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ అన్నారు. తాను బండి సంజయ్తో ఒకేసారి 40 సెకన్లు మాత్రమే మాట్లాడానని చెప్పారు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులతో జైలుకు పంపారని, న్యాయం గెలిచిందని, కోర్టు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీకి కారణమైన వారి గురించి విచారణలో భాగంగా తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పి పోలీసులకు సహకరించినట్లు ప్రశాంత్ తెలిపాడు. జర్నలిస్టుగా తాను గతంలో విద్యార్థుల సమస్యలను బయటికి తెచ్చానని, అలాంటిది వారి భవిష్యత్తును ఎలా పాడుచేస్తానని అన్నారు. తనకు బెయిల్ రావడానికి ఏ రాజకీయ పార్టీ సహకరించలేదన్నారు. తనకు నేరుగా కోర్టు నుంచి బెయిల్ వచ్చిందన్నారు.
Read also: Fenugreek Water: మెంతి నీటితో బరువు తగ్గుతారా..! ఎలా?
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ఏప్రిల్ 4న హిందీ పరీక్ష పేపర్ లీక్ అయిన సంగతి తెలిసిందే.. విచారణలో భాగంగా ప్రశాంత్ అనే జర్నలిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెన్త్ పేపర్ను ప్రశాంత్ వాట్సాప్లో పలువురికి షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో పాటు మరికొందరు పేపర్ను పంపారని తెలిపారు. కరీంనగర్లో గత వారం అర్ధరాత్రి బండి సంజయ్ను అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కేసులో బండి సంజయ్ను ఏ1గా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బండి సంజయ్కు కూడా 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు బండి సంజయ్ను కరీంనగర్ జైలుకు తరలించారు. హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత శుక్రవారం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న కూడా ఈ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో పాటు బండి సంజయ్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఇటీవలే కోర్టు ప్రశాంత్ సహా మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసి జైలు నుంచి విడుదలైంది.
CV Anand: ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయి
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!