SSC Paper Leak : బండితో మాట్లాడింది 40 సెకెండ్లే.. ఏ2 నిందితుడు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC Paper Leak: తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టయి కరీంనగర్ జైలులో ఉన్న నిందితులు బెయిల్పై ఇవాల విడుదలయ్యారు. A2 – ప్రశాంత్, A3 – మహేష్, A4 – గణేష్ ఈరోజు ఉదయం విడుదలయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మీడియాతో మాట్లాడారు. 10వ హిందీ ప్రశ్నపత్రం బయటకు రాగానే జర్నలిస్టుల బృందంలో జర్నలిస్టుగా పంచుకున్నానని ప్రశాంత్ చెప్పాడు. ఆ గ్రూపుల్లో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో తానేమీ తప్పు చేయలేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాడతానని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ అన్నారు. తాను బండి సంజయ్తో ఒకేసారి 40 సెకన్లు మాత్రమే మాట్లాడానని చెప్పారు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులతో జైలుకు పంపారని, న్యాయం గెలిచిందని, కోర్టు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీకి కారణమైన వారి గురించి విచారణలో భాగంగా తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పి పోలీసులకు సహకరించినట్లు ప్రశాంత్ తెలిపాడు. జర్నలిస్టుగా తాను గతంలో విద్యార్థుల సమస్యలను బయటికి తెచ్చానని, అలాంటిది వారి భవిష్యత్తును ఎలా పాడుచేస్తానని అన్నారు. తనకు బెయిల్ రావడానికి ఏ రాజకీయ పార్టీ సహకరించలేదన్నారు. తనకు నేరుగా కోర్టు నుంచి బెయిల్ వచ్చిందన్నారు.
Read also: Fenugreek Water: మెంతి నీటితో బరువు తగ్గుతారా..! ఎలా?
Also Read
ఏప్రిల్ 4న హిందీ పరీక్ష పేపర్ లీక్ అయిన సంగతి తెలిసిందే.. విచారణలో భాగంగా ప్రశాంత్ అనే జర్నలిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెన్త్ పేపర్ను ప్రశాంత్ వాట్సాప్లో పలువురికి షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో పాటు మరికొందరు పేపర్ను పంపారని తెలిపారు. కరీంనగర్లో గత వారం అర్ధరాత్రి బండి సంజయ్ను అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కేసులో బండి సంజయ్ను ఏ1గా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బండి సంజయ్కు కూడా 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు బండి సంజయ్ను కరీంనగర్ జైలుకు తరలించారు. హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత శుక్రవారం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న కూడా ఈ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో పాటు బండి సంజయ్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఇటీవలే కోర్టు ప్రశాంత్ సహా మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసి జైలు నుంచి విడుదలైంది.
CV Anand: ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయి
తాజావార్తలు
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
-
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్తో అదరగొట్టిన నాని.!
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!