SSC Paper Leak : బండితో మాట్లాడింది 40 సెకెండ్లే.. ఏ2 నిందితుడు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC Paper Leak: తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టయి కరీంనగర్ జైలులో ఉన్న నిందితులు బెయిల్పై ఇవాల విడుదలయ్యారు. A2 – ప్రశాంత్, A3 – మహేష్, A4 – గణేష్ ఈరోజు ఉదయం విడుదలయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మీడియాతో మాట్లాడారు. 10వ హిందీ ప్రశ్నపత్రం బయటకు రాగానే జర్నలిస్టుల బృందంలో జర్నలిస్టుగా పంచుకున్నానని ప్రశాంత్ చెప్పాడు. ఆ గ్రూపుల్లో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో తానేమీ తప్పు చేయలేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాడతానని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ అన్నారు. తాను బండి సంజయ్తో ఒకేసారి 40 సెకన్లు మాత్రమే మాట్లాడానని చెప్పారు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులతో జైలుకు పంపారని, న్యాయం గెలిచిందని, కోర్టు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీకి కారణమైన వారి గురించి విచారణలో భాగంగా తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పి పోలీసులకు సహకరించినట్లు ప్రశాంత్ తెలిపాడు. జర్నలిస్టుగా తాను గతంలో విద్యార్థుల సమస్యలను బయటికి తెచ్చానని, అలాంటిది వారి భవిష్యత్తును ఎలా పాడుచేస్తానని అన్నారు. తనకు బెయిల్ రావడానికి ఏ రాజకీయ పార్టీ సహకరించలేదన్నారు. తనకు నేరుగా కోర్టు నుంచి బెయిల్ వచ్చిందన్నారు.
Read also: Fenugreek Water: మెంతి నీటితో బరువు తగ్గుతారా..! ఎలా?
Also Read
- Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
ఏప్రిల్ 4న హిందీ పరీక్ష పేపర్ లీక్ అయిన సంగతి తెలిసిందే.. విచారణలో భాగంగా ప్రశాంత్ అనే జర్నలిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెన్త్ పేపర్ను ప్రశాంత్ వాట్సాప్లో పలువురికి షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో పాటు మరికొందరు పేపర్ను పంపారని తెలిపారు. కరీంనగర్లో గత వారం అర్ధరాత్రి బండి సంజయ్ను అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కేసులో బండి సంజయ్ను ఏ1గా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బండి సంజయ్కు కూడా 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు బండి సంజయ్ను కరీంనగర్ జైలుకు తరలించారు. హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత శుక్రవారం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న కూడా ఈ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో పాటు బండి సంజయ్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఇటీవలే కోర్టు ప్రశాంత్ సహా మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసి జైలు నుంచి విడుదలైంది.
CV Anand: ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయి
తాజావార్తలు
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!