Jana Reddy: యశోద ఆస్పత్రిలో చేరిన జానారెడ్డి.. స్టంట్ వేసిన వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
congress senior leader jana reddy admitted in yashoda hospital: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి యశోద ఆస్పత్రిలో చేరారు. వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. జానారెడ్డి మంగళవారం మోకాలి చికిత్స కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. మోకాలికి చికిత్స సమయంలో వివిధ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో జానా రెడ్డి గుండె రక్తనాళాల్లో ఒకటి మూసుకుపోయినట్లు తేలిందని వైద్యులు తెలిపారు. జానారెడ్డికి నిన్న రాత్రి వైద్యులు స్టంట్ చేశారు. ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకగా ఉందని భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశ్రాంతి అవసరమని తెలిపారు. ఆరోగ్యం పట్ల భయపడవలసిన పరిస్థితి లేదని పేర్కొన్నారు. జానారెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు భయాందోలనకు గురయ్యారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు కుటుంబ సభ్యులు.
Read also: SSC Paper Leak : బండితో మాట్లాడింది 40 సెకెండ్లే.. ఏ2 నిందితుడు కీలక వ్యాఖ్యలు
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలంటూ ఇటీవల హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో జానా రెడ్డి పాల్గొన్నారు. జానా రెడ్డి సీఎం పదవి మినహా అన్ని రకాల మంత్రి పదవులు చేపట్టారు. 2018 ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో జానా రెడ్డి ఓటమి పాలయ్యారు. నోముల నరసింహయ్య మరణం తర్వాత నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జానా రెడ్డి పోటీ చేశారు. నోముల నరసింహయ్య కుమారుడు భగత్ చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జానారెడ్డి మునుపటిలా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. పార్టీ కీలక నేతలు వచ్చినప్పుడు నిర్వహించే సమావేశాలకు హాజరవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జానా రెడ్డి తనయుడు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే మిర్యాలగూడ, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాల్లో జానా రెడ్డి, ఆయన కుమారుడు పోటీ చేసే అవకాశం లేకపోలేదు.
Fenugreek Water: మెంతి నీటితో బరువు తగ్గుతారా..! ఎలా?
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!