Jana Reddy: యశోద ఆస్పత్రిలో చేరిన జానారెడ్డి.. స్టంట్ వేసిన వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
congress senior leader jana reddy admitted in yashoda hospital: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి యశోద ఆస్పత్రిలో చేరారు. వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. జానారెడ్డి మంగళవారం మోకాలి చికిత్స కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. మోకాలికి చికిత్స సమయంలో వివిధ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో జానా రెడ్డి గుండె రక్తనాళాల్లో ఒకటి మూసుకుపోయినట్లు తేలిందని వైద్యులు తెలిపారు. జానారెడ్డికి నిన్న రాత్రి వైద్యులు స్టంట్ చేశారు. ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకగా ఉందని భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశ్రాంతి అవసరమని తెలిపారు. ఆరోగ్యం పట్ల భయపడవలసిన పరిస్థితి లేదని పేర్కొన్నారు. జానారెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు భయాందోలనకు గురయ్యారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు కుటుంబ సభ్యులు.
Read also: SSC Paper Leak : బండితో మాట్లాడింది 40 సెకెండ్లే.. ఏ2 నిందితుడు కీలక వ్యాఖ్యలు
Also Read
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలంటూ ఇటీవల హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో జానా రెడ్డి పాల్గొన్నారు. జానా రెడ్డి సీఎం పదవి మినహా అన్ని రకాల మంత్రి పదవులు చేపట్టారు. 2018 ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో జానా రెడ్డి ఓటమి పాలయ్యారు. నోముల నరసింహయ్య మరణం తర్వాత నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జానా రెడ్డి పోటీ చేశారు. నోముల నరసింహయ్య కుమారుడు భగత్ చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జానారెడ్డి మునుపటిలా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. పార్టీ కీలక నేతలు వచ్చినప్పుడు నిర్వహించే సమావేశాలకు హాజరవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జానా రెడ్డి తనయుడు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే మిర్యాలగూడ, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాల్లో జానా రెడ్డి, ఆయన కుమారుడు పోటీ చేసే అవకాశం లేకపోలేదు.
Fenugreek Water: మెంతి నీటితో బరువు తగ్గుతారా..! ఎలా?
తాజావార్తలు
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..