ఉత్తమ్ కుమార్ పోయి… ఉత్తర కుమారుడు వచ్చిండు : గుత్తా సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్గొండ జిల్లా:-తెలంగాణ పీసీసీ నియామకంపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. పీసీసీగా ఉన్న ఉత్తమ్ కుమార్ పోయి… ఉత్తర కుమారుడు వచ్చిండని… ఎవరు వచ్చినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదని సెటైర్ వేశారు. వచ్చే రెండేళ్లు.. కాంగ్రెస్ అంతర్గత సమస్యలు పరిష్కరించడానికే సరిపోదని ఎద్దేవా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని… సమైక్య ఆంధ్ర నుంచే తెలంగాణకు నదీ జలాల విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఎక్కువ నీటిని దోచుకోవాలని జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు.
read also : ఇండియాలో మరోసారి 50 మార్క్ దాటిన కరోనా కేసులు
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
ఆనాడు ఎక్కువ నీటిని తీసుకుపోవాలనే దురాశే కర్నూలు వరదలకు కారణమని… శ్రీశైలం 850 అడుగులకు చేరినప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి నీరు తీసుకుపోవాలని పేర్కొన్నారు. అయితే.. సంగమేశ్వర ప్రాజెక్టు పేరుతో.. 800 అడుగుల నుంచి నీరు తరలించాలని జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఈ పథకంతో.. మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే కృష్ణా జలాల పోరాటమని అంటోన్న బిజెపీ నాయకులవి పసలేని ఆరోపణలు అని ఫైర్ అయ్యారు. కేంద్రం నిరంకుశంగా ఏడు మండలాలను ఏపీలో కలిపింది వాస్తవం కాదా..? దానికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే.. తెలంగాణ-ఏపీ మధ్య వివాదాలను పరిష్కరించాలని తెలిపారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!