Governor Tamilisai: గిరిజనులు ఆరోగ్యం కాపాడుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిత్యం బిజీగా వుంటారు. అటు పాలనా వ్యవహారాల్లో బిజీగా వున్నా.. వివిధ సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటారు. స్వతహాగా డాక్టర్ అయిన తమిళిసై ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలంటారు. నల్లమలలో పర్యటించిన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అక్కడి గిరిజనులతో మమేకం అయ్యారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు మరిచిపోలేను, ఎప్పటికీ మరిచిపోను అన్నారు. గిరిజనులు, ఆదివాసీలకు సేవ చేయడం సంతోషంగా అనిపిస్తుంది. మంచి చదువు, మంచి ఆరోగ్యంతో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను. ఓ వైద్యురాలిగా మీ జీవన స్థితిగతుల పట్ల ఆందోళనగా ఉంటుంది. మీరంతా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.
Also Read
న్యూట్రిషన్ పథకం చాలా ప్రత్యేకమైనది. టూ వీలర్ అంబులెన్స్, రాజశ్రీ కోళ్లు, మందులు అందించడం ఆనందం కలిగిస్తుంది. అప్పాపూర్, భౌరాపూర్ లో మాదిరిగా పథకాలు ఇతర పెంటలకు విస్తృతం చేసేలా చర్యలు తీసుకుంటాం. మీరంతా ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలి. ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పని చేయాలి. నా ప్రయత్నంలో సహకరించిన రెడ్ క్రాస్, కలెక్టర్, తదితర శాఖలకు అభినందనలు అన్నారు తమిళి సై సౌందరరాజన్.
తెలంగాణ రాజ్ భవన్ తరుపున నాగర్ కర్నూలు జిల్లాలో 6 చెంచు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై. 6 గ్రామాల అభివృద్ధికి రూ.50 లక్షలు నిధులను కేటాయించామని తెలిపిన గవర్నర్ తమిళి సై. 6 గ్రామాలలో విద్య, వైద్యం, వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి. శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు గవర్నర్ తమిళిసై. కరోనా నుండి ప్రజలు బయటపడాలని సంతోషంగా ఉండాలని స్వామి అమ్మవారిని కోరుకున్నా అన్నారు గవర్నర్ తమిళిసై సుందరరాజన్.
తాజావార్తలు
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
-
Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!