Gang War: వీరి దుంప తెగ.. రైల్వే ట్రాక్ పై కొట్టుకుని ప్రాణాలే పోగొట్టుకున్నారు కదరా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gang War: హైదరాబాద్లో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. పాతబస్తీలోని భవానీనగర్ ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగింది. పట్టాలపై కొందరు యువకులు గ్యాంగ్ వార్ కు దిగారు. కొట్లాటల మత్తులో రైలు రావడం కూడా గమనించలేదు. దీంతో రైలు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఇలాంటి గ్యాంగ్ వార్లు సర్వసాధారణంగా మారాయని స్థానికులు అంటున్నారు.
Read also: Vijayawada: ఆటో డ్రైవర్ నిజాయితీ.. ప్రయాణికురాలి నగలు బ్యాగు అప్పగింత
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
అసలేం జరిగింది..
హైదరాబాద్ పాతబస్తీలోని భవాని నగర్ గంజాయి అమ్మాకాలకు అడ్డగా మారింది. గంజాయి మత్తులో యువకులు హల్ చల్ సృష్టిస్తున్నారు. గంజాయి మత్తులో వున్న యువకుల వల్ల ఏం జరుగుతుందో ఏమో అంటూ స్థానికులు బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. అయితే నిన్న అర్థరాత్రి భవాని నగర్ రైల్వే ట్రాక్ పై గంజాయి మత్తులో గ్యాంగ్ వార్ జరిగింది. అయితే ఈ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడి నుంచి వస్తున్న ట్రైన్ ను గమనించలేదు. రైలు ఢీకొడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కొందరు గంజాయి గ్యాంగ్ అక్కడి నుంచి పరారయ్యారు. రైల్వే ట్రాక్ పై కొందరు రెండు మృతదేహాలను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి హుటా హుటిన చేరుకున్న రైల్వే పోలీసులు వారిద్దిరి మృతదేహాలను మార్చురీకి తరలించారు. భవానీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇద్దరు మృత దేహాలు ఎవరివి అని ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. త్వరలో గంజాయి గ్యాంగ్ ను పట్టుకుంటామని అన్నారు.
ఇక మరోవైపు ఈ రైల్వే ట్రాక్ పై తరచూ మద్యం, గంజాయి మత్తులో గొడవలు దాడులు జరిగి హత్యలు, ఆత్మహత్యలు ఘటనలు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైన్ వస్తున్న పట్టించుకోకుండా గ్యాంగ్ వార్ జరిగిందంటే.. వారు ఎంతగా గంజాయి మత్తులో ఉంటారో అర్థం చేసుకోవాలని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా.. వారి వల్ల చుట్టుపక్కల ఇళ్లవారు బయటకు భయంతో బయటకు రాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు వీరి పై నిఘాపెట్టాలని కోరుతున్నారు. భవాని నగర్ లో గంజాయితో స్థానిక ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారని, ఏ సమయంలో ఏం జరుగుతుందో బయటకు రావాలంటేనే భయంగా వుందని వాపోతున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై నిఘాపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Andhra Pradesh: వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్న్యూస్
తాజావార్తలు
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!