Vijayawada: ఆటో డ్రైవర్ నిజాయితీ.. ప్రయాణికురాలి నగలు బ్యాగు అప్పగింత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటో ఓ మహిళా మరిచిపోయిన ఎనిమిది లక్షల విలువైన ఆభరణాలను బ్యాగ్ను తిరిగి అప్పగించి ప్రశంసలు అందుకున్నాడు. వివరాలు.. బెజవాడకు చెందిన ఈ ఆటో డ్రైవర్ పేరు పొలవరపు నాగేశ్వరరావు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం విజయవాడలోని తన బంధువుల పెళ్లికి వెళ్తున్న నవీన అనే వివాహిత నాగేశ్వరావు ఆటో ఎక్కింది. ఆమె చేతిలో నెలల చిన్నారి కూడా ఉంది. ఆటో ఎక్కిన అనంతరం నవీన తన పాపకు పాలు పట్టించింది. ఈ క్రమంలో సీట్లో బ్యాగును పక్కన పెట్టింది. పాపకు పాలు పట్టిన ఆమె తన గమ్యం రాగానే దిగిపోయి.. నగల బ్యాగు సంగతే మరచిపోయింది.
Also Read: Nitish Kumar : ఎన్టీయే నుంచి వైదొలగనున్న నితీశ్ కుమార్.. ప్రధాని అభ్యర్థి ఆయనే ?
Also Read
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
అది చూసుకోని డ్రైవర్ నాగేశ్వరరావు కూడా ఇంటికి వెళ్లిపోయాడు. ఇక ఉదయాన్నే ఆటో తూడుస్తుండగా ఆటోలో బ్యాగ్ను గుర్తించాడు నాగేశ్వరరావు. అందులో పెళ్లికి సంబంధించిన విలువైన వస్త్రాలతో పాటు ఎనిమిది లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి. అవి చూసి అత్యాశకు పోకుండా.. తన నిజాయితీని చూపించాడు. అది నవీన బ్యాగుగా గుర్తించి తిరిగి ఆమెకు అప్పగించాడు. ఎలా ఉన్న బ్యాగ్ అలాగే తిరిగి ఇవ్వడంతో నవీన సంతోషించింది. ఈ విషయం తెలిసి తోటీ ఆటో డ్రైవర్లు నాగేశ్వరరావు నిజాయితీని కొనియాడుతూ ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఆటో సంఘం కూడా నాగేశ్వరరావు అభినందించింది.
Also Read: Prakasam: దారుణం.. మద్యం మత్తులో వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారం
తాజావార్తలు
-
Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్లో పడ్డట్లే..
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..