HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
- ఫేక్ ప్రచారం నమ్మొద్దన్న రంగనాథ్
- కాప్రా మినహా చెరువుల్లో నిమజ్జనాలు
- ప్రత్యామ్నాయంగా బేబీ పాండ్స్ ఏర్పాటు
- ఉత్సవ కమిటీలకు హైడ్రా భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRAA : హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. ఎన్టీవీ (NTV) ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ప్రజలు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
కాప్రా చెరువు మినహా అన్నింటిలో నిమజ్జనాలు
నగర పరిధిలోని ఒక్క కాప్రా చెరువు మినహా మిగిలిన అన్ని చెరువుల్లోనూ గణేష్ నిమజ్జనాలు యథావిధిగా జరుగుతాయని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కాప్రా చెరువును పర్యావరణ పరిరక్షణ , బయోడైవర్సిటీ అభివృద్ధి పనుల కోసం సిద్ధం చేస్తుండటం, అక్కడ నీరు లేకపోవడం వల్లే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
Also Read
- CM Revanth Reddy: శాసనసభలో చర్చిద్దామా..? బీఆర్ఎస్కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్..
- TG SAFE : పనీర్ పేరుతో పామ్ ఆయిల్ గేమ్.. 14 డెయిరీలపై TG SAFE దాడులు
- Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
- Secunderabad Army : ఆర్మీ ఆయుధాల మిస్సింగ్ కేసు.. ఐదు రోజులు గడిచినా మిస్టరీనే.!
ప్రత్యామ్నాయంగా బేబీ పాండ్స్ నిర్మాణం
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని రంగనాథ్ తెలిపారు. కాప్రా చెరువు వద్ద నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా బేబీ పాండ్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఉప్పల్ , ఐడీపీఎల్ చెరువుల వద్ద కూడా ప్రధాన నీటి వనరులను దెబ్బతీయకుండా, వాటి పక్కనే నిమజ్జనం కోసం ప్రత్యేకమైన పాండ్స్ నిర్మిస్తున్నామని చెప్పారు.
భక్తులకు, ఉత్సవ కమిటీలకు హైడ్రా స్వాగతం
హైడ్రా తరుపున వినాయక చవితి వేడుకలను, నిమజ్జన కార్యక్రమాలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న నిరాధారమైన వ్యాఖ్యలను నమ్మవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ , నిర్ణీత ప్రాంతాల్లో ప్రశాంతంగా నిమజ్జనాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
-
Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
-
Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
-
Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!