Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
- అధికారులపై కంగనా రనౌత్ ఫైర్
- ‘రూ.11 కోట్లు ఖర్చు చేయలేరా? అంటూ ఆగ్రహం
- మండిలో పర్యటించిన బీజేపీ ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నిధుల కింద అభివృద్ధి పనులకు విడుదలైన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడంపై అధికారులను నిలదీశారు. మండి జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమె అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రూ.11 కోట్ల నిధులు..
మండి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఎంపీ నిధుల కింద సుమారు రూ.11 కోట్లు విడుదలైనప్పటికీ.. అందులో చాలా మొత్తాన్ని అధికారులు ఖర్చు చేయలేదని కంగనా ఆరోపించారు. దాదాపు రెండేళ్లు గడిచినా నిధులు పూర్తిస్థాయిలో వినియోగించలేదని ఆమె పేర్కొన్నారు. మార్చి-ఏప్రిల్ నాటికి మొత్తం ప్రాంతంలో రూ.1 కోటి కంటే తక్కువ నిధులు మాత్రమే వినియోగించారని, మండి ప్రాంతంలో సుమారు రూ.5.5 కోట్ల నిధులు అందుబాటులో ఉండగా.. కేవలం రూ.50-60 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు అధికారుల నుంచి సమాచారం అందిందని ఆమె తెలిపారు.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
- PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ
- Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
‘ఇలాంటి హామీలు ఇక వద్దు’
అధికారులు పదేపదే హామీలు ఇవ్వడం మానేసి.. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కంగనా సూచించారు. “ఈ పనికిరాని హామీలు నాకు చెప్పొద్దు. ప్రతి DISHA కమిటీ సమావేశంలోనూ నేను ఇవే హామీలు వింటున్నాను” అని ఆమె అధికారులను నిలదీశారు. గతంలో కూడా MPLADS నిధులపై తాను ప్రశ్నించినప్పుడు ఎలాంటి సమస్య లేదని, తమ నిధుల్లో 90 శాతం ఇప్పటికే అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నామని అధికారులు చెప్పారని కంగనా గుర్తుచేశారు. అయితే బయటి సంస్థలు నిర్వహించిన వివరణాత్మక సర్వేల ద్వారా వాస్తవ పరిస్థితి బయటపడిందని ఆమె పేర్కొన్నారు.
ఇకపై సమస్యలను పరిష్కరిస్తామని చెప్పే హామీలు తనకు అవసరం లేదని కంగనా స్పష్టం చేశారు. “సమస్యను పరిష్కరిస్తామని చెప్పే సమయం అయిపోయింది. ఇవి రెండేళ్ల నాటి సమస్యలు. ఏడాదిన్నర నుంచి రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు పని పూర్తి చేసి.. పూర్తయిందని నాకు నివేదిక ఇవ్వండి” అని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఏం చెప్పాలి?
మీడియా ముందు తన నియోజకవర్గం గురించి తాను ఏం చెప్పాలని ప్రశ్నించారు. “ప్రజలు ఇక్కడికి వచ్చి కేవలం జీతాలు తీసుకోవడానికే వస్తున్నారని నేను మీడియా ముందు చెప్పాలా? మన రాష్ట్ర ప్రజల గురించి, వారి పని తీరు గురించి నేను ఏం చెప్పాలి? ఇంత సోమరితనం, అసమర్థతతో ఈ కుర్చీల్లో కూర్చున్నారని జాతీయ మీడియా ముందు చెప్పాలా? నా సొంత నియోజకవర్గం, నా సొంత కొండ ప్రాంత ప్రజల గురించి నేను అలా చెప్పాలా?” అని ఆమె ప్రశ్నించారు.
మండిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై ప్రజలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారని కంగనా అన్నారు. మరోవైపు అధికారులు మాత్రం తన కార్యాలయాల్లో కూర్చొని నవ్వుతూ, తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. మండిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే వేగవంతం చేయాలని అధికారులను కంగనా ఆదేశించారు. అందుబాటులో ఉన్న MPLADS నిధులను సక్రమంగా వినియోగించి, అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు.
Mandi, Himachal Pradesh: During the DISHA Committee meeting, BJP MP Kangana Ranaut says, “…Last time as well, when I inquired about MPLADS, and our DISHA committees meet so regularly, whenever I asked about MPLADS, I was told that there was absolutely no hiccup and that 90% of… pic.twitter.com/3pfCD6Kpqb
— IANS (@ians_india) September 5, 2026
తాజావార్తలు
-
Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
-
Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
-
Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
-
CM Revanth Reddy: శాసనసభలో చర్చిద్దామా..? బీఆర్ఎస్కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్..
-
PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!