Kishan Reddy: నేడు నామినేషన్ దాఖలు చేయనున్న జి.కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. మల్కాజిగిరి స్థానానికి 8 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. ఇక మరోవైపు ఇవాళ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ హాజరుకానున్నారు. ముందుగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేశారు.
Read also: HimachalPradesh : ఫస్ట్ టైం మొబైల్ నెట్ వర్క్ అందుకున్న గ్రామం.. గ్రామస్తులతో మాట్లాడిన మోడీ
Also Read
అనంతరం ఆలయం నుంచి పాదయాత్రగా వెళ్లి ఉదయం 11 గంటలకు మెహబూబ్ కళాశాలలోని వివేకానంద విగ్రహానికి నివాళులర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ప్రసంగించనున్నారు. ఇక..నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 25 కాగా.. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అయితే.. మే 13న ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు జూన్ 4న ప్రకటించి.. ఇదిలావుంటే.. 19, 23, 24 తేదీలు మంచి ముహూర్తాలు కావడంతో ఆ రోజుల్లో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
Bengaluru: కూతురి హంతకుడిని చంపిన తల్లి.. బెంగళూర్లో డబుల్ మర్డర్ కలకలం..
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!