RTC MD Sajjanar: మేడారం జాతరకు ఫ్రీ జర్నీ.. గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. మేడారం జాతరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అదే సమయంలో మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగా, మేడారం జాతరకు టిఎస్ఆర్టిసి 6000 ప్రత్యేక బస్సులను నడుపుతుందని సజ్జనార్ తెలిపారు. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లు ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఈ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. అలాగే మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమలులో ఉంటుందని తెలిపారు. ఈ నెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించామని అన్నారు.
Read also: Naa Saami Ranga OTT: కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Also Read
- Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
- Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
- Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా.. హైదరాబాద్ నుంచి మేడారం వరకు మొత్తం 228 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఉదయం 6.00, 6.30 గంటలకు జేబీఎస్ నుంచి.. బయలుదేరగా.. 7 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సులు కదలనున్నాయి. ఇందులో.. పెద్దలకు రూ.750 చిన్నారులకు రూ. 450 టిక్కెట్ ధర నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఇక మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి, 2.30, 3.00 గంటలకు బయలుదేరతాయి. ఇక.. ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఈ బస్సుల్లో రానుపోను టిక్కెట్ ఛార్జీ పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.310లు. ఇక.. సూపర్లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులను కూడా నడుపుతారు కానీ.. వీటిల్లో ఉచిత ప్రయాణం లేదు. అయితే.. సూపర్ లగ్జరీలో టిక్కెట్ ధర పెద్దలకు రూ.750, చిన్నారులకు రూ.550, ఏసీ బస్సుల్లో పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా నిర్ణయించారు.
Bandi Sanjay: కదిలిన బండి పాదయాత్ర.. మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు..
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!