Property cheating: అట్లెట్లా నమ్మినావ్ బ్రో.. బిల్డింగ్ చూపిస్తే కోట్లు ఇచ్చేస్తావా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Property cheating: ఇటీవల కాలంలో కొందరు ఈజీమనీకి అలవాటు పడ్డారు. కష్టపడి పని చేయడం సాధ్యం కాదు.. ఈజీ మనీ కోసం కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను, అత్యాశపరులను లక్ష్యంగా చేసుకుని వారికిచ్చిన కాడిని దోచుకుంటున్నారు. ఒ వ్యక్తికి బిల్టిండ్ చూపించి సింపుల్ గా కోట్లు కొట్టేసిన ఘటన హైదరాబాద్ వెలుగు చూసింది. రెండంతస్తుల భవనం అమ్మకానికి ఉందని నమ్మించి రెండున్నర కోట్లకు కొన్నాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Read also: Opposition Parties Meeting: ప్రధాని పదవిపై కాంగ్రెస్కు ఆసక్తి లేదు : మల్లికార్జున ఖర్గే
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్కు చెందిన జమ్ముల సునీల్ కుమార్కు కొన్నాళ్ల క్రితం వెంకటేష్ ధనరాజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనతికాలంలోనే ఇద్దరూ దగ్గరయ్యారు. వెంకటేష్ సునీల్ కుమార్ మాట్లాడుతూ తార్నాకలో 400 గజాల స్థలం ఉందని, సోదరుడు ప్రసాద్ తో కలిసి బ్యాంకు రుణం తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టామన్నారు. నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. భవనంలోని మొదటి, రెండో అంతస్తులను రూ.2.60 కోట్లకు విక్రయించాలని నిర్ణయించినట్లు వెంకటేష్ సునీల్ కుమార్ కు తెలిపారు. తార్నాకలో నిర్మాణంలో ఉన్న ఇంటిని చూపించి అమ్మకానికి పెట్టారన్నారు. దాంతో సునీల్ కుమార్ ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు. సునీల్ రెండు విడతలుగా వెంకటేష్, అతని భార్య లక్ష్మిలకు రూ.2.40 కోట్లు చెల్లించాడు.
రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన రూ.20 లక్షలు చెల్లించేందుకు ఇద్దరూ అంగీకరించారు. అయితే వెంకటేష్ గత కొంత కాలంగా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, ఆస్తి పత్రాలు ఇవ్వకుండా పరారీలో ఉన్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే వెంకటేష్ సునీల్ కుమార్ కథ విన్న వారందరూ ఏంటీ బ్రో ఎలా నమ్మినావు అంటున్నారు. ఇంత ఈజీగా మోసవేంటని అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇటువంటి వారిని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Opposition Parties Meeting: ప్రధాని పదవిపై కాంగ్రెస్కు ఆసక్తి లేదు : మల్లికార్జున ఖర్గే
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..