Food Poisoning: పాలేరు నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Poisoning: ఖమ్మంజిల్లా పాలేరులో నవోదయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యాలయంలో తిండి తిని సుమారు 40 మంది విద్యార్థి, విద్యార్థినులు తీవ్ర అస్వస్థతతకు లోనయ్యారు. ఒకరి తరువాత అస్వస్థతకు గురికావడంతో.. ఆందోళన చెందిన ఉపాధ్యాయులు హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. అయితే సంక్రాంతి పండుగకు వెళ్లి తెచ్చకున్న తినుబండారాల వలనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వారుతెలిపారు. కాగా. దీనిపై విద్యార్థులు నిన్న విద్యాలయంలో వండిన వంట తినడం వల్లనే వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యామని వాపోతున్నారు. నిన్న చికెన్ వండారని అది తిన్నప్పటి నుంచి కడుపులో నొప్పి రావడం, వాంతులు అవడం జరిగిందని స్టూడెంట్స్ తెలిపినట్లు సమచారం.
Read also: Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ ఇంట విషాదం.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ..
Also Read
అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను.. విద్యాలయ డార్మిటరీలో చికిత్స అందిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. పిల్లలకు కోలుకుంటున్నారని, ఎటువంటి హానీ లేదని చెబుతున్నారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురైనా పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఇంత జరుగుతున్నా మాకు సమచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. పిల్లలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలని, పోలీసులు దీనిపై దృష్టి పెట్టాలని.. ఈఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. సంక్రాంతి పండుగకు తెచ్చుకున్న తిను బండారాలు ఒక్కరు తింటే అందరు విద్యార్థులు అస్వస్థలకు ఎలా గురయ్యారో విద్యాలయ యాజమాన్యం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Weather Forecast: ఉదయం చలి.. మధ్యాహ్నం వేడి.. ఏమిటీ పరిస్థితి..
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!