Food Poisoning: పాలేరు నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Poisoning: ఖమ్మంజిల్లా పాలేరులో నవోదయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యాలయంలో తిండి తిని సుమారు 40 మంది విద్యార్థి, విద్యార్థినులు తీవ్ర అస్వస్థతతకు లోనయ్యారు. ఒకరి తరువాత అస్వస్థతకు గురికావడంతో.. ఆందోళన చెందిన ఉపాధ్యాయులు హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. అయితే సంక్రాంతి పండుగకు వెళ్లి తెచ్చకున్న తినుబండారాల వలనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వారుతెలిపారు. కాగా. దీనిపై విద్యార్థులు నిన్న విద్యాలయంలో వండిన వంట తినడం వల్లనే వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యామని వాపోతున్నారు. నిన్న చికెన్ వండారని అది తిన్నప్పటి నుంచి కడుపులో నొప్పి రావడం, వాంతులు అవడం జరిగిందని స్టూడెంట్స్ తెలిపినట్లు సమచారం.
Read also: Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ ఇంట విషాదం.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను.. విద్యాలయ డార్మిటరీలో చికిత్స అందిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. పిల్లలకు కోలుకుంటున్నారని, ఎటువంటి హానీ లేదని చెబుతున్నారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురైనా పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఇంత జరుగుతున్నా మాకు సమచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. పిల్లలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలని, పోలీసులు దీనిపై దృష్టి పెట్టాలని.. ఈఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. సంక్రాంతి పండుగకు తెచ్చుకున్న తిను బండారాలు ఒక్కరు తింటే అందరు విద్యార్థులు అస్వస్థలకు ఎలా గురయ్యారో విద్యాలయ యాజమాన్యం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Weather Forecast: ఉదయం చలి.. మధ్యాహ్నం వేడి.. ఏమిటీ పరిస్థితి..
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!