Flexi in Jagityal: చిట్టీల వ్యాపారీ ఆచూకీ చెబితే రూ.3 లక్షల నగదు.. జగిత్యాలలో వెలసిన ఫెక్సీ
Flexi in Jagityal: చిట్టీల పేరుతో ఎన్ని మోసాలు, దోపిడీలు చేసినా ప్రజలు చిట్టీలు వేయడం మానడం లేదు. ఇంట్లో ఏదైనా ఖర్చు పెట్టవచ్చన్న ఆశతో రూపాయి.. రూపాయి పొదుపు చేసి డబ్బులు కడుగుతుంటారు. అయితే ఇదే అలుసుగా భావించిన కొందరు కేటుగాళ్లు.. చాలా ప్రాంతాల్లో చిట్టీల పేరుతో డబ్బులు దండుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మోసాల బారిన పడిన కొందరు బాధపడుతుంటే.. మరికొందరు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే మరికొందరు వారి కసితీరేలా అతను ఎక్కడున్న ముందుకు వచ్చేలా కొత్త ఐడియాలు చేస్తున్నారు. వారు చేస్తున్న పని చూస్తే.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అనిపిస్తుంది. అతని పేరును నెంబర్లతో సహా ప్లెక్సీ పెట్టడంతో చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు కొందరు నాయకులు ఆయా ప్రాంతాల్లో పని చేయకున్నా.. ప్రజలకు అందుబాటులో లేకుంటే.. కనిపించడం లేదంటూ స్థానికులు పోస్టర్లు వేసి నిరసన తెలుపుతుంటారు. అయితే ఇప్పుడు చిట్టీ వ్యాపారి పేరుతో పోస్టర్లు వెలిశాయి.^మోసం చేశాడంటూ ఆపోస్టర్ పై రాసి నెబర్లతో సహా ప్రింట్ వేయించి ప్లెక్సీని కట్టారు.
Read also: Sharad Pawar: అందుకే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు..
Also Read
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
- Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
ఇంతకీ ఆ పోస్టర్ ఎక్కడో కాదండోయ్ జగిగ్యాల జిల్లాలోని గోవిందు పల్లెలో వెలసింది. తమ వద్ద చిట్టీలు కట్టించుకుని డబ్బులతో పరారైన ‘గాండ్ల వెంకన్న’ అనే వ్యక్తి ఫోటోలతో ఫ్లెక్సీలు తయారు చేసిన జగిత్యాలలో రోడ్లమీద ఏర్పాటుచేశారు. గాండ్ల వెంకన్న అనే వ్యక్తి కనబడుటలేదు అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అయితే..పై ఫోటోలోని వ్యక్త పేరు గాండ్ల వెంకన్న ఈ వ్యక్తి పెద్ద మొత్తంలో డ్బుబలు తీసుకుని కుటుంబంతో సహా పరార్ అయ్యాడు. ఆచూకి తెలిపినవారికి రూ.3 లక్షలు బహుమతి ఇస్తాం అంటూ ప్రకటించారు బాధిత మహిళలు. ఫ్లెక్సీలో బాధిత మహిళల ఫోన్ నంబర్లు కూడా ప్రింట్ చేయించారు. ఈ వ్యక్తి ఆచూకి తెలిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయమని కోరు వారి ఫోన్ నంబర్లు ముద్రించారు. ఫోన్ చేయండీ రూ.3లక్షలు గెలుచుకోండి అంటూ ఫ్లెక్సీలో రాయించారు. దీంతో అతను ఎక్కడున్న పట్టుబడటం ఖాయమంటున్నారు బాధితులు. మరి మోసపోయిన బాదితులకు పోలీలసులు న్యాయం చేస్తారా? లేక ప్రజలే వెంకన్నను పట్టుకుని తగిన బుద్దిచెబుతారా? అనే పరిస్థితి నెలకుంది.
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!