Flexi in Jagityal: చిట్టీల వ్యాపారీ ఆచూకీ చెబితే రూ.3 లక్షల నగదు.. జగిత్యాలలో వెలసిన ఫెక్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flexi in Jagityal: చిట్టీల పేరుతో ఎన్ని మోసాలు, దోపిడీలు చేసినా ప్రజలు చిట్టీలు వేయడం మానడం లేదు. ఇంట్లో ఏదైనా ఖర్చు పెట్టవచ్చన్న ఆశతో రూపాయి.. రూపాయి పొదుపు చేసి డబ్బులు కడుగుతుంటారు. అయితే ఇదే అలుసుగా భావించిన కొందరు కేటుగాళ్లు.. చాలా ప్రాంతాల్లో చిట్టీల పేరుతో డబ్బులు దండుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మోసాల బారిన పడిన కొందరు బాధపడుతుంటే.. మరికొందరు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే మరికొందరు వారి కసితీరేలా అతను ఎక్కడున్న ముందుకు వచ్చేలా కొత్త ఐడియాలు చేస్తున్నారు. వారు చేస్తున్న పని చూస్తే.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అనిపిస్తుంది. అతని పేరును నెంబర్లతో సహా ప్లెక్సీ పెట్టడంతో చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు కొందరు నాయకులు ఆయా ప్రాంతాల్లో పని చేయకున్నా.. ప్రజలకు అందుబాటులో లేకుంటే.. కనిపించడం లేదంటూ స్థానికులు పోస్టర్లు వేసి నిరసన తెలుపుతుంటారు. అయితే ఇప్పుడు చిట్టీ వ్యాపారి పేరుతో పోస్టర్లు వెలిశాయి.^మోసం చేశాడంటూ ఆపోస్టర్ పై రాసి నెబర్లతో సహా ప్రింట్ వేయించి ప్లెక్సీని కట్టారు.
Read also: Sharad Pawar: అందుకే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు..
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఇంతకీ ఆ పోస్టర్ ఎక్కడో కాదండోయ్ జగిగ్యాల జిల్లాలోని గోవిందు పల్లెలో వెలసింది. తమ వద్ద చిట్టీలు కట్టించుకుని డబ్బులతో పరారైన ‘గాండ్ల వెంకన్న’ అనే వ్యక్తి ఫోటోలతో ఫ్లెక్సీలు తయారు చేసిన జగిత్యాలలో రోడ్లమీద ఏర్పాటుచేశారు. గాండ్ల వెంకన్న అనే వ్యక్తి కనబడుటలేదు అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అయితే..పై ఫోటోలోని వ్యక్త పేరు గాండ్ల వెంకన్న ఈ వ్యక్తి పెద్ద మొత్తంలో డ్బుబలు తీసుకుని కుటుంబంతో సహా పరార్ అయ్యాడు. ఆచూకి తెలిపినవారికి రూ.3 లక్షలు బహుమతి ఇస్తాం అంటూ ప్రకటించారు బాధిత మహిళలు. ఫ్లెక్సీలో బాధిత మహిళల ఫోన్ నంబర్లు కూడా ప్రింట్ చేయించారు. ఈ వ్యక్తి ఆచూకి తెలిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయమని కోరు వారి ఫోన్ నంబర్లు ముద్రించారు. ఫోన్ చేయండీ రూ.3లక్షలు గెలుచుకోండి అంటూ ఫ్లెక్సీలో రాయించారు. దీంతో అతను ఎక్కడున్న పట్టుబడటం ఖాయమంటున్నారు బాధితులు. మరి మోసపోయిన బాదితులకు పోలీలసులు న్యాయం చేస్తారా? లేక ప్రజలే వెంకన్నను పట్టుకుని తగిన బుద్దిచెబుతారా? అనే పరిస్థితి నెలకుంది.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?