Sharad Pawar: అందుకే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: నిరుద్యోగంపై కేంద్రంలో, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాలను విమర్శిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దేశంలో నిరుద్యోగం కారణంగా పెళ్లి వయసులో ఉన్న యువకులకు వధువులు దొరకడం లేదని ఆయన బుధవారం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సమస్యలను సృష్టిస్తున్నాయని శరద్ పవార్ ఆరోపించారు.
ఎన్సీపీ జన్జాగర్ యాత్ర ప్రచారాన్ని ప్రారంభించే ముందు పవార్ మాట్లాడుత.., వర్గాల మధ్య చీలిక ఏర్పడిందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.“మన రైతులు ఉత్పత్తిని పెంచినందున దేశంలో ఆకలి సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుంది, కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు రైతులకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు, బదులుగా వారు మధ్యవర్తుల ప్రయోజనాలను కాపాడుతున్నారు. సాధారణ ప్రజలను నెట్టివేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది” అని పవార్ అన్నారు. నేటి యువత విద్యావంతులని, ఉద్యోగాలు కోరే హక్కు వారికి ఉందని కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి అన్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
మహారాష్ట్ర నుంచి పరిశ్రమలు వెళ్తున్నాయని, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం లేదని, కొత్త వ్యాపారాలు స్థాపించేందుకు ఎలాంటి అవకాశాలు కల్పించడం లేదని, దీని వల్ల నిరుద్యోగం పెరుగుతోందని పవార్ తెలిపారు. “ఒకసారి నేను ప్రయాణిస్తున్నప్పుడు 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల 15 నుండి 20 మంది పురుషులు ఒక గ్రామంలోని పబ్లిక్ స్క్వేర్లో ఖాళీగా కూర్చోవడం నాకు కనిపించింది, నేను వారిని ఏమి చేస్తున్నారు అని అడిగాను, వారు గ్రాడ్యుయేట్లు అని కొందరు చెప్పారు, వారు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అని కొందరు చెప్పారు. వారు వివాహం చేసుకున్నారా అని నేను అడిగినప్పుడు, ప్రతి ఒక్కరూ ప్రతికూలంగా స్పందించారు.” అని ఎన్సీపీ చీఫ్ అన్నారు.
Amit Shah: అస్సాంలో కేంద్ర మంత్రి అమిత్ షా విమానం అత్యవసర ల్యాండింగ్
కారణం ఏమిటని అడగ్గా.. తమకు ఉద్యోగాలు లేకపోవడంతో అమ్మాయిలను ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫిర్యాదులు ఎక్కువగా వినబడుతున్నాయని పవార్ పేర్కొన్నారు. కానీ ఉపాధి అవకాశాలను పెంపొందించే విధానాలను అవలంబించడానికి బదులుగా, వర్గాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యాదృచ్ఛికంగా ఏదో ఒక అంశాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని అన్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..