Sharad Pawar: అందుకే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: నిరుద్యోగంపై కేంద్రంలో, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాలను విమర్శిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దేశంలో నిరుద్యోగం కారణంగా పెళ్లి వయసులో ఉన్న యువకులకు వధువులు దొరకడం లేదని ఆయన బుధవారం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సమస్యలను సృష్టిస్తున్నాయని శరద్ పవార్ ఆరోపించారు.
ఎన్సీపీ జన్జాగర్ యాత్ర ప్రచారాన్ని ప్రారంభించే ముందు పవార్ మాట్లాడుత.., వర్గాల మధ్య చీలిక ఏర్పడిందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.“మన రైతులు ఉత్పత్తిని పెంచినందున దేశంలో ఆకలి సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుంది, కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు రైతులకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు, బదులుగా వారు మధ్యవర్తుల ప్రయోజనాలను కాపాడుతున్నారు. సాధారణ ప్రజలను నెట్టివేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది” అని పవార్ అన్నారు. నేటి యువత విద్యావంతులని, ఉద్యోగాలు కోరే హక్కు వారికి ఉందని కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి అన్నారు.
Also Read
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
మహారాష్ట్ర నుంచి పరిశ్రమలు వెళ్తున్నాయని, ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం లేదని, కొత్త వ్యాపారాలు స్థాపించేందుకు ఎలాంటి అవకాశాలు కల్పించడం లేదని, దీని వల్ల నిరుద్యోగం పెరుగుతోందని పవార్ తెలిపారు. “ఒకసారి నేను ప్రయాణిస్తున్నప్పుడు 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల 15 నుండి 20 మంది పురుషులు ఒక గ్రామంలోని పబ్లిక్ స్క్వేర్లో ఖాళీగా కూర్చోవడం నాకు కనిపించింది, నేను వారిని ఏమి చేస్తున్నారు అని అడిగాను, వారు గ్రాడ్యుయేట్లు అని కొందరు చెప్పారు, వారు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అని కొందరు చెప్పారు. వారు వివాహం చేసుకున్నారా అని నేను అడిగినప్పుడు, ప్రతి ఒక్కరూ ప్రతికూలంగా స్పందించారు.” అని ఎన్సీపీ చీఫ్ అన్నారు.
Amit Shah: అస్సాంలో కేంద్ర మంత్రి అమిత్ షా విమానం అత్యవసర ల్యాండింగ్
కారణం ఏమిటని అడగ్గా.. తమకు ఉద్యోగాలు లేకపోవడంతో అమ్మాయిలను ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫిర్యాదులు ఎక్కువగా వినబడుతున్నాయని పవార్ పేర్కొన్నారు. కానీ ఉపాధి అవకాశాలను పెంపొందించే విధానాలను అవలంబించడానికి బదులుగా, వర్గాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యాదృచ్ఛికంగా ఏదో ఒక అంశాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని అన్నారు.
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!