Fisherman Fights For Fishes: ఈ చెరువునుంచి ఆ.. చెరువులోకి చేపలు.. ఘర్షణకు దిగిన మత్సకారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జిల్లాలు వేరు, రెవెన్యూ డివిజన్లు వేరు, మండలాలు కూడా వేరు, ఆ రెండు గ్రామాల మధ్య విస్తరించి. ఒకే ఒక్క చెరువు, చేపలు పట్టే హక్కు మాత్రం ఒకే ఊరి మత్స్యకారులకు సొంతం. కాగా.. కళ్ల ఎదుట కళకళలాడుతున్న చెరువు, చెంగున దుంకుతున్న చేపలు కనిపిస్తున్నా ఆదాయం దక్కకపోవడంతో ఒక ఊరి బెస్తలు ఉసూరు మంటున్నారు. ఈ నేపథ్యంలో.. చెరువు రెండు పంచాయతీల పరిధిలో విస్తరించినా చేపలు పట్టే హక్కు ఒకే గ్రామం వారికి ఉండడం వివాదానికి దారితీసింది.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్సాన్పల్లి పంచాయతీలో ఆ ఊరితో పాటు శేరి మల్లారెడిపల్లి మధిర గ్రామం ఉన్నాయి. మెదక్ జిల్లాలో రికార్డుల్లో గడిపెద్దాపూర్ పెద్ద చెరువుగా నమోదు చేయబడింది. ఒకే చెరువు అయినా రికార్డుల్లో రెండు వేర్వేరు పేర్లతో కొనసాగుతుంది. ఈనేపథ్యంలో.. నీటి వినియోగదారుల సంఘం ఒక్కటే.. కానీ.. శిఖం భూమి ఎక్కువగా ఉండటంతో ఆయకట్టు సంఘంలో కన్సాన్పల్లి గ్రామానికి చెందిన సభ్యులదే మెజార్టీ. దీంతో.. రెండున్నర దశాబ్దాల క్రితం ఈ చెరువులో చేపలు పెంచేందుకు మత్స్యసహకార సంఘం ఏర్పాటైంది. అయితే.. అప్పట్లో కన్సాన్పల్లి, శేరిమల్లారెడ్డిపల్లి గ్రామాల మత్స్యకారులు సభ్యత్వ రుసుము చెల్లించలేక సభ్యత్వం తీసుకోలేదు. ఈనేపథ్యంలో.. సంఘంలో కేవలం గడిపెద్దాపూర్ మత్స్యకారులే సభ్యులుగా చేరారు. దీంతో గడిపెద్దాపూర్ మత్స్యసహకార సంఘంగా నమోదైంది. అయితే..చెరువులో ప్రతీ సంవత్సరం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను విడుస్తున్నారు. కానీ చేపలు పట్టుకునే సమయంలో గొడవులు జరుగుతున్నాయి.
Also Read
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
read also: Rohit – Dhawan: మరో అరుదైన ఫీట్.. రెండో స్థానం సొంతం
ఈనేపథ్యంలో.. చెరువు శిఖంలో మూడొంతులు మా గ్రామానికే చెందడంతో తమకూ వాటా ఉంటుందని కన్సాన్పల్లి, శేరిమల్లారెడ్డిపల్లి గ్రామాల మత్స్యకారులు విధించడం వివాదాలకు దారితీస్తున్నది. దీంతో..మత్స్యకారుల సొసైటీలో సభ్యత్వం లేకపోవడంతో ఆ గ్రామాలవారికి చేపలు పట్టే అధికారం ఉండదని గడిపెద్దాపూర్ మత్స్యకారుల వాదన. కాగా.. ఇరవయ్యేళ్లుగా ప్రతీయేటా చేపల పంచాయితీ జరుగుతున్నది. కన్సాన్పల్లి, శేరిమల్లారెడ్డిపల్లి మత్స్యకారులు చేపలు పట్టడం కోసం వేళ్తే వారిని గడిపెద్దాపూర్ వాసులు చితకబాదడం.. గడిపెద్దాపూర్ మత్స్యకారులు ఇటువైపు వచ్చి చేపలు పడుతుంటే కన్సాన్పల్లి వాసులు దాడులు చేయడం తరచుగా జరుగుతుంది. కన్సాన్పల్లి గ్రామ మత్స్యకారులు చెరువులో తమ గ్రామ పరిధి వరకు స్తంభాలు పాతి ఫెన్సింగ్ ఏర్పాటు చేయగా గడిపెద్దాపూర్ మత్స్యకారులు విరగకొట్టారు. ఈనేపథ్యంలో.. రెండు గ్రామాల మధ్య కక్ష్యలు పెరుగుతుంది. అంతేకాకుండా.. ఈ చెరువులోకి త్వరలో సింగూరు జలాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో గొడవలు పెరిగే అవకాశం ఉన్నది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకముందే సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని రెండు గ్రామస్తులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!