Hyderabad: నగరంలో వరుస అగ్నిప్రమాద ఘటనలు.. నిన్న జీడిమెట్ల, నేడు మణికొండ, రామంతపూర్..
- ఇవాళ నగరంలో మరో రెండు చోట్లు అగ్ని ప్రమాద ఘటనలు..
- మణికొండ, రామంతపూర్ లో ఒక్కసారిగా చలరేగిన మంటలు..
- మణికొండలో ఆపార్ట్ మెంట్ లో మంటలు -రామంతపూర్ లో ఎలక్ట్రిక్ బైక్ తో మంటలు..
Hyderabad: హైదరాబాద్ లోని జీడిమెట్లలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువకముందే.. ఇవాళ నగరంలో మరో రెండు చోట్లు అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇవాళ మణికొండ, రామంతపూర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా ఈ ఘటనలు కలకలం సృష్టించాయి. అగ్ని ప్రమాద ఘటనలతో ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సమాచారం అందిన వెంటనే పరుగులు పెట్టి మంటలను అదుపు చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. రెండు రోజుల నుంచి నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read also: Pushpa 2: దేవిశ్రీకి షాక్.. ‘గంగమ్మ జాతర’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
హైదరాబాద్ మణికిండలోని ఈఐపీఎల్ అపార్ట్మెంట్లో ఎనిమిదో అంతస్తులోని 804 ఫ్లాట్లో రెండు రోజుల క్రితమే సంతోష్ అనే వ్యక్తి గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం అనంతరం దేవుడి గదిలో దీపం పెట్టి కుటుంబ సభ్యులు నిద్రపోయారు. ఇవాళ ఉదయం తెల్లవారు జామున దీపం ఎదురుగా ఉన్న కళశానికి ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. వెంటనే తేరుకున్న సంతోష్ కుటుంబ సభ్యులు ఇంట్లో వున్న గ్యాస్ను ఆఫ్ చేసి అపార్ట్ మెంట్ నుంచి కిందికి పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసే పనిలోపడ్డారు. కాగా..మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ పూర్తిగా కాలిపోయింది. గృహప్రవేశం చేసిన రెండు రోజులకే అగ్నిప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Read also: WI vs BAN: భారీ తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన వెస్టిండీస్..
మరోవైపు నగరంలోని రామంతపూర్ లోని వివేక్ నగర్ లోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారు జామున 3.30 సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంటల తాకిడికి పార్కింగ్ లో ఉన్న మరో ఎనిమిది బైకులు దగ్ధమయ్యాయి. పార్కింగ్ లో రెండు బ్యాటరీ బైక్ లు, ఏడు ఇతర బైకులు ఉన్నట్లు సమాచారం. వెంటనే స్థానికులు మంటలను అదుపుచేశారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీ బైక్ పేలి భారీగా మంటలు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.
Telangana BJP: నేడు ప్రధానితో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం..
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!