Hyderabad: నగరంలో వరుస అగ్నిప్రమాద ఘటనలు.. నిన్న జీడిమెట్ల, నేడు మణికొండ, రామంతపూర్..
- ఇవాళ నగరంలో మరో రెండు చోట్లు అగ్ని ప్రమాద ఘటనలు..
- మణికొండ, రామంతపూర్ లో ఒక్కసారిగా చలరేగిన మంటలు..
- మణికొండలో ఆపార్ట్ మెంట్ లో మంటలు -రామంతపూర్ లో ఎలక్ట్రిక్ బైక్ తో మంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ లోని జీడిమెట్లలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువకముందే.. ఇవాళ నగరంలో మరో రెండు చోట్లు అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇవాళ మణికొండ, రామంతపూర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా ఈ ఘటనలు కలకలం సృష్టించాయి. అగ్ని ప్రమాద ఘటనలతో ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సమాచారం అందిన వెంటనే పరుగులు పెట్టి మంటలను అదుపు చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. రెండు రోజుల నుంచి నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read also: Pushpa 2: దేవిశ్రీకి షాక్.. ‘గంగమ్మ జాతర’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
Also Read
హైదరాబాద్ మణికిండలోని ఈఐపీఎల్ అపార్ట్మెంట్లో ఎనిమిదో అంతస్తులోని 804 ఫ్లాట్లో రెండు రోజుల క్రితమే సంతోష్ అనే వ్యక్తి గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం అనంతరం దేవుడి గదిలో దీపం పెట్టి కుటుంబ సభ్యులు నిద్రపోయారు. ఇవాళ ఉదయం తెల్లవారు జామున దీపం ఎదురుగా ఉన్న కళశానికి ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. వెంటనే తేరుకున్న సంతోష్ కుటుంబ సభ్యులు ఇంట్లో వున్న గ్యాస్ను ఆఫ్ చేసి అపార్ట్ మెంట్ నుంచి కిందికి పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసే పనిలోపడ్డారు. కాగా..మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ పూర్తిగా కాలిపోయింది. గృహప్రవేశం చేసిన రెండు రోజులకే అగ్నిప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Read also: WI vs BAN: భారీ తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన వెస్టిండీస్..
మరోవైపు నగరంలోని రామంతపూర్ లోని వివేక్ నగర్ లోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారు జామున 3.30 సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంటల తాకిడికి పార్కింగ్ లో ఉన్న మరో ఎనిమిది బైకులు దగ్ధమయ్యాయి. పార్కింగ్ లో రెండు బ్యాటరీ బైక్ లు, ఏడు ఇతర బైకులు ఉన్నట్లు సమాచారం. వెంటనే స్థానికులు మంటలను అదుపుచేశారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీ బైక్ పేలి భారీగా మంటలు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.
Telangana BJP: నేడు ప్రధానితో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం..
తాజావార్తలు
-
India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
-
Ravi Shastri: “చాలా పెద్ద తప్పు చేస్తున్నారు”.. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
-
Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!