Hyderabad: నగరంలో వరుస అగ్నిప్రమాద ఘటనలు.. నిన్న జీడిమెట్ల, నేడు మణికొండ, రామంతపూర్..
- ఇవాళ నగరంలో మరో రెండు చోట్లు అగ్ని ప్రమాద ఘటనలు..
- మణికొండ, రామంతపూర్ లో ఒక్కసారిగా చలరేగిన మంటలు..
- మణికొండలో ఆపార్ట్ మెంట్ లో మంటలు -రామంతపూర్ లో ఎలక్ట్రిక్ బైక్ తో మంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ లోని జీడిమెట్లలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువకముందే.. ఇవాళ నగరంలో మరో రెండు చోట్లు అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇవాళ మణికొండ, రామంతపూర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా ఈ ఘటనలు కలకలం సృష్టించాయి. అగ్ని ప్రమాద ఘటనలతో ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సమాచారం అందిన వెంటనే పరుగులు పెట్టి మంటలను అదుపు చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. రెండు రోజుల నుంచి నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read also: Pushpa 2: దేవిశ్రీకి షాక్.. ‘గంగమ్మ జాతర’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
హైదరాబాద్ మణికిండలోని ఈఐపీఎల్ అపార్ట్మెంట్లో ఎనిమిదో అంతస్తులోని 804 ఫ్లాట్లో రెండు రోజుల క్రితమే సంతోష్ అనే వ్యక్తి గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం అనంతరం దేవుడి గదిలో దీపం పెట్టి కుటుంబ సభ్యులు నిద్రపోయారు. ఇవాళ ఉదయం తెల్లవారు జామున దీపం ఎదురుగా ఉన్న కళశానికి ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. వెంటనే తేరుకున్న సంతోష్ కుటుంబ సభ్యులు ఇంట్లో వున్న గ్యాస్ను ఆఫ్ చేసి అపార్ట్ మెంట్ నుంచి కిందికి పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసే పనిలోపడ్డారు. కాగా..మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ పూర్తిగా కాలిపోయింది. గృహప్రవేశం చేసిన రెండు రోజులకే అగ్నిప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Read also: WI vs BAN: భారీ తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన వెస్టిండీస్..
మరోవైపు నగరంలోని రామంతపూర్ లోని వివేక్ నగర్ లోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారు జామున 3.30 సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంటల తాకిడికి పార్కింగ్ లో ఉన్న మరో ఎనిమిది బైకులు దగ్ధమయ్యాయి. పార్కింగ్ లో రెండు బ్యాటరీ బైక్ లు, ఏడు ఇతర బైకులు ఉన్నట్లు సమాచారం. వెంటనే స్థానికులు మంటలను అదుపుచేశారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీ బైక్ పేలి భారీగా మంటలు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.
Telangana BJP: నేడు ప్రధానితో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం..
తాజావార్తలు
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!