Inter students: ఇంటర్ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. మధ్యలో మానేస్తే ఫీజు వాపసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter students: ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. చదువు కుంటూ మధ్యలో కాలేజీ మానేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజు వాపసు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే కళాశాలల్లో విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కనీసం ఏడాదికి రెండుసార్లు వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కౌన్సెలింగ్ విద్యార్థులకు ప్రత్యేక ఫ్యాకల్టీలను నియమించాలని సూచిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం మార్గదర్శకాలను విడుదల చేశారు.
Read also: TSPSC paper leak case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. నేడు హైకోర్టు తీర్పు
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ఇటీవల నార్సింగిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఘటన అనంతరం ఎంహెచ్ఆర్డీలో అధికారులు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇంటర్ విద్యా బోధనకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు. అనంతరం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ మార్చి 17న సమావేశమై మార్గదర్శకాలు ఎలా ఉండాలనే దానిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా విద్యార్థులు కళాశాలను మధ్యలోనే వదిలేస్తే, వారు చెల్లించిన ఫీజులో కొంత వాపసు ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు కళాశాలలో చేరిన మూడు నెలల్లోపు ఉపసంహరించుకుంటే, 75 శాతం ఫీజును యాజమాన్యం తిరిగి ఇవ్వాలి. 6 నెలల్లో 50 శాతం, ఆ తర్వాత 25 శాతం. వారం రోజుల్లోగా వాపసు ఇవ్వాలని స్పష్టం చేశారు.
Read also: Delhi Liquor Scam: లిక్కర్ కేసులో మరో మలుపు.. ఛార్జిషీట్ లో మరో ముగ్గురు
ప్రభుత్వ మార్గదర్శకాలు:
* ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల్లోనే తరగతులు నిర్వహించాలి.
* కళాశాలలను అర్హత కలిగిన సిబ్బందితో నిర్వహించాలి. సిబ్బందికి కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలి.
* సిబ్బందిని మధ్యలో (ఏప్రిల్ కంటే ముందు) తొలగించకూడదు. తొలగింపు విషయంలో ముందుగా నోటీసు ఇవ్వాలి. వారి స్థానాలను భర్తీ చేయాలి.
* ప్రిన్సిపాల్ను మార్చాల్సి వస్తే ముందుగా ఆయా కళాశాలలు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి అనుమతి తీసుకోవాలి.
* కాలేజీ సమయాల్లో బయటి వ్యక్తులను లోపలికి అనుమతించరు. నిర్ణీత సమయాల్లో తల్లిదండ్రులను అనుమతించవచ్చు.
* ప్రతి కళాశాల ఇంటర్ బోర్డు జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ను అనుసరించాలి.
* అదనపు తరగతులు రోజువారీ 3 గంటల కంటే ఎక్కువ తీసుకోకూడదు.
* రెసిడెన్షియల్ కాలేజీల్లో విద్యార్థులకు కనీసం 8 గంటల నిద్ర ఇవ్వాలి.
* ఉదయం తయారుకావడానికి, బ్రేక్ ఫాస్ట్ కు గంటన్నర సమయం ఇవ్వాలి.
* మధ్నాహ్నం, రాత్రి భోజనం కోసం 45 నిమిషాలు అనుమతించాలి.
* ప్రతి రోజు స్పోర్ట్స్, రిక్రియేషన్ కార్యక్రమాలు చేయాలి. సాయంత్రం రిక్రియేషన్ కోసం ఒక గంట సమయం ఇవ్వాలి.
* ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన డైరీలను నిర్వహించాలి.
* విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం ఉండాలి.
* ప్రతి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి.
Viral Video: ఛా.. ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టానో..
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!