Hyderabad Crime: విషాదం.. కోడలు వేధింపులతో పురుగుల మందు తాగిన కుటుంబసభ్యులు..
- సికింద్రాబాద్ తాజ్ త్రి స్టార్ హోటల్ లో ఓ కుటుంబం ఆత్మహత్యయత్నం..
- రూమ్ లో అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు..
- యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్న మహంకాళి పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: కోడలు వేధింపులు తాళలేక కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ లో కలకలం రేపింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ త్రి స్టార్ హోటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. హోటల్ లోని మూడవ అంతస్తులో 308 గదిలో ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్ఠలికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురిని 108 అనబులెన్స్ లో యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు ముగ్గురూ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చెందినవారుగా గుర్తించారు. తండ్రి నారాయణ (52) తల్లి పద్మావతి (47 ) కొడుకు సృజన్ (23) గా గుర్తించారు. ఇటీవలే ఫిబ్రవరి 14న తల్లిదండ్రులు.. కొడుకు సృజన్ ను ఘనంగా పెళ్లి చేశారు.
Read also: Festival Rush: హైదరాబాద్లోని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ..
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
అయితే కొద్ది రోజులు బాగా సాగిన వీరి జీవితంలో మనస్పర్థలు మొదలయ్యాయని సమాచారం. దీంతో కోడలు కావ్య కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని చెంచిపల్లి పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్తపై 498 A కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు అందరు కోడలు కావ్వకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. ముగ్గురు కలిసి సికింద్రాబాద్ చేరుకుని తాజ్ త్రి స్టార్ హోటల్ లోని 308 రూమ్ లో బస చేశారు. వీరు ముగ్గురు కలిసి కోడలికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాట్లు తెలిపారు. అవమానం భరించలేమని జ్యూస్ లో మత్తుపదార్డం కలిపి ముగ్గురు సేవించారు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని హూటల్ యాజమాన్యం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనేవ వీరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కోడలు కావ్వ, భర్త సృజన్ పై పెట్టిన కేసుపై ఆరా తీస్తున్నారు.
Health Tips: మెంతి ఆకులు, గింజలు గొప్పతనం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
తాజావార్తలు
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!