Falcon Scam : ఫాల్కన్ స్కాం.. అమర్దీప్ విమానం ఈడీ వేలం
- అమర్దీప్కు చెందిన విమానాన్ని వేలానికి సిద్ధం చేసిన ఈడీ
- డిసెంబర్ 7న పరిశీలన, 9న ఆన్లైన్ వేలం
- ₹792 కోట్ల ఫాల్కన్ స్కాం దర్యాప్తులో కీలక పురోగతి
- బాధితులకు పరిహారంగా విమానం విక్రయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫాల్కన్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ముఖ్యమైన అడుగు వేసింది. అమర్దీప్ కుమార్కు చెందిన హాకర్ 800A ప్రైవేట్ విమానాన్ని స్వాధీనం చేసుకున్న ఈడీ, ఇప్పుడు దానిని అధికారికంగా వేలం వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫాల్కన్ స్కాం బహిర్గతమైన వెంటనే అమర్దీప్ మరియు అతని గ్యాంగ్ ఇదే విమానంలో దుబాయ్కి పారిపోయిన విషయం తెలిసిందే.
తర్వాత భారత్కు తిరిగి వచ్చిన ఈ ఎయిర్క్రాఫ్ట్ను ఈడీ స్వాధీనం చేసుకుని, ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో నిలిపి ఉంచింది. విమానం చెడిపోకుండా, ఉపయోగించడానికి వీలుగా ఉండేందుకు వేలం వేసేందుకు కోర్టు అనుమతి కూడా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈడీ ప్రకటన ప్రకారం, ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా ఈ విమానం అమ్మకానికి ఉంచబడుతోంది. డిసెంబర్ 7న విమానం పరిశీలనకు అందుబాటులో ఉండగా, డిసెంబర్ 9న ఆన్లైన్ వేలం జరగనుంది. ఈ విమానం విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని ఫాల్కన్ స్కాం వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారంగా చెల్లించనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ 2025 ఫిబ్రవరి 11న నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ విచారణను ప్రారంభించింది. దర్యాప్తులో ఫాల్కన్ గ్రూప్ పేరుతో అమర్దీప్ కుమార్ నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ నడిపి, పెట్టుబడిదారులను మొత్తం ₹792 కోట్లు మోసగించినట్లు ఈడీ గుర్తించింది. ప్రస్తుతం అమర్దీప్ విదేశాల్లో తలదాచుకొని ఉన్నాడు. అయితే అతని సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర టోష్నీవాల్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ COO ఆర్యన్ సింగ్ ఛబ్రాలను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేశారు.
అంతేకాకుండా, ఈడీ ఇప్పటివరకు ₹18.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఫాల్కన్ స్కాం బాధితులకు న్యాయం అందించడంలో భాగంగా చేపట్టిన ఈడీ చర్య, దర్యాప్తులో ఒక కీలక దశగా భావిస్తున్నారు. పెట్టుబడిదారుల డబ్బుతో కొనుగోలు చేసిన విమానం విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వారికి తిరిగి చెల్లించడం ద్వారా కొంత ఉపశమనం లభించబోతోందని బాధితులు ఆశిస్తున్నారు.
Maruti Suzuki: మారుతి సుజుకి చరిత్ర.. 30 రోజుల్లో 2.29 లక్షల కార్ల విక్రయాలు!
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?