Childrens Kidnap: రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్ ముఠాలు.. అంతా అవాస్తవమన్న పోలీసులు
Childrens Kidnap: రాష్ట్రంలోకి చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠాలు ప్రవేశించాయి…ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సందేశాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హనుమకొండ, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ సహా పలు జిల్లాల్లో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయన్న వార్త స్థానిక వర్గాల్లో వైరల్ అవుతోంది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు స్పందించారు. అయితే చిన్నారుల అపహరణ, కిడ్నాప్ ముఠాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలన్నీ అవాస్తవమని పోలీసులు కొట్టిపారేశారు. ఇలాంటి గాలి వార్తలను ఎవరూ నమ్మవద్దని ప్రజలకు అంటున్నారు.
Read also: Money Laundering Case : హేమంత్ సోరెన్తో ధీరజ్ సాహుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
Also Read
- TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
ఇక కామారెడ్డి జిల్లాలో కూడా గత కొద్ది రోజులుగా చిన్న పిల్లలను గ్యాంగ్లు కిడ్నాప్ చేస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కామారెడ్డిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురిని కాలనీవాసులు గుర్తించగా వారిలో నలుగురు పరారయ్యారు. మరో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు సంచరిస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో జనం జంకుతున్నారు. వాటిలో కొన్ని పాత వీడియోలని పోలీసులు వివరించారు. ఇక మరోవైపు నిజామాబాద్ జిల్లాలో చిన్నారుల కిడ్నాప్ల పరంపర కలకలం సృష్టిస్తోంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5 రోజుల్లోనే 3 ప్రాంతాల్లో చిన్నారులు కిడ్నాప్కు గురయ్యారు.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇద్దరు చిన్నారులను పోలీసులు సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే కిడ్నాప్ కు గురైన వారంతా 7 ఏళ్ల లోపు చిన్నారులే కావడం సంచలనంగా మారింది. జనవరి 30న మాలపల్లికి చెందిన మహ్మద్ మిహాజ్ అనే ఏడేళ్ల బాలుడిని ఓ ముఠా కిడ్నాప్ చేసి హైదరాబాద్లో రూ.3 లక్షలకు విక్రయించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల ప్రత్యేక బృందాలు 4 రోజుల్లోనే బాలుడిని రక్షించి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠా తిరుతుందని, పోలీసులు దీని దృష్టి పెట్టి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏది ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712685070కు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
Srisailam Darshan: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. RTC బస్ టికెట్తో పాటే దర్శన టికెట్ బుకింగ్..
తాజావార్తలు
-
IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!
-
NBK111 : బాలయ్య – గోపించంద్ మలినేని – తమన్ ఈసారి సౌండ్ అదిరిపోద్ది!
-
Ruturaj Gaikwad: కన్నీరు దిగమింగుతూ జట్టు కోసం ఆడాడు.. ఈ విజయం అతడికే అంకితం!
-
TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
-
Iran Prince Reza Pahlavi: ఇరాన్ బహిష్కృత నేత రెజా పహ్లవిపై దాడి.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!