Srisailam Darshan: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. RTC బస్ టికెట్తో పాటే దర్శన టికెట్ బుకింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Darshan: హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు తీసుకునే వారికి శ్రీశైలం ఆలయంలో దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. 1,200 రోజువారీ దర్శన టిక్కెట్లు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 200 స్పర్శ దర్శనం టిక్కెట్లు, 500 సూపర్ క్విక్ దర్శన్ టిక్కెట్లు, మరో 500 క్విక్ దర్శనం టిక్కెట్లు ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఆర్టీసీ మధ్య ఎంవోయూ కుదిరింది. స్పర్శ దర్శనం టిక్కెట్ ధర రూ.500, శీఘ్ర దర్శనం ధర రూ.300, శీఘ్ర దర్శనం ధర రూ.150 అని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. శనివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 100 కొత్త బస్సులను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
Read also: Lord Surya Stotram: ఈ స్తోత్రాలు వింటే ఐశ్వర్యం కలిగేలా ఆదిత్యుడు ఆశీర్వదిస్తాడు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
90 ఎక్స్ప్రెస్ బస్సులు, 10 సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన 60 రోజుల్లోనే 15 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. మహిళలతో కలిసి రూ.535 కోట్ల చెక్కును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్కు ముఖ్యమంత్రి అందజేశారు. హైదరాబాద్-శ్రీశైలం మధ్య 10 సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు తిరుగుతాయని.. వారం రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సుల్లో జేబీఎస్ నుంచి పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.540. ఎంజీబీఎస్ నుంచి రూ.700, రూ.510లను ఆర్టీసీ ఖరారు చేసింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రతి 50 నిమిషాలకు ఒక ఏసీ బస్సు, ప్రతి 20 నిమిషాలకు ఒక సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్ ఎం శ్రీధర్ తెలిపారు.
Surya Stotram: ఆయురారోగ్య ప్రాప్తి, సకల సౌభాగ్యాలకు ఈ స్తోత్ర పారాయణం చేయండి
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!