Fake Document: బతికుండగానే బరితెగించారు.. విచారణలో బయటపడ్డ భాగోతం
Fake certificate of death while alive: డబ్బు మనిషిని మార్చేస్తుంది ఇది ఎప్పుడు మనం వినే మాటలు. కానీ నేటి సమాజంలో ఆడబ్బు కోసం మనిషినే చంపేవరకు దారులు తీస్తున్నాయి. అయితే భూమికోసం కుటుంబసభ్యులు చేసిన ఓ ఘటన ఇప్పుడు ఆగ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.
Read also:Atrocity in Maharashtra: అయ్యో బిడ్డా ఆ నొప్పిని ఎలా భరించావురా! 11 మంది 10 గంటలు అత్యాచారం
Also Read
మెదక్ జిల్లా నర్సాపూర్ లో మహిళ బతికి ఉండగానే చనిపోయిందని బంధువులు భూమి కాజేసే యత్నం చేశారు. దుర్గమ్మ పేరు మీద ఉన్న 1.20 ఎకరాల భూమిని తమ పేరు మీద మార్చుకునే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22న బాధిత మహిళ కాకినాడలో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా బంధువు శ్రీ లక్ష్మీ ఫేక్ డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. దుర్గమ్మ కూతురిగా శ్రీ లక్ష్మీ అన్ని రకాల డాక్యుమెంట్లు సృష్టించింది. ప్లాన్ ప్రకారం పట్టామార్పిడి కోసం స్లాట్ బుక్ చేసి 20 రోజుల క్రితం నర్సాపూర్ MRO ఆఫీస్ కి వచ్చింది. నిన్న మరోసారి ఎమ్మార్వో ఆఫీస్ కి దుర్గమ్మ బంధువు రావడంతో.. ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ లేకపోవడంతో అనుమానం చెందిన డెప్యూటీ తహశీల్దార్ నవీన్..ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ కావాలని డిమాండ్ చేశాడు. ఒరిజన్సర్టిఫికెట్ లేకుంటే పట్టా మార్పుడి చేయవా అంటూ డిప్యూటీ ఎమ్మార్వోతో శ్రీ లక్ష్మీ బంధువుల వాగ్వాదానికిదిగారు.
ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ తీసుకువస్తామని అక్కడినుంచి బంధువులు వెళ్లిపోయారు. అనుమానం వచ్చి తహశీల్దార్ విచారణ చేయించడంతో అసలు భాగోతం బట్టబయలైంది. విచారణలో దుర్గమ్మ బతికే ఉన్నట్టు నిర్దారణ కావడంతో ఒక్కసారిగా ఆఫీసర్లు షాక్ తిన్నారు. వెంటనే దుర్గమ్మను ఎమ్మార్వో ఆఫీస్ కి తహశీల్దార్ పిలిపించడండో దుర్గమ్మ అవాక్కైంది. నేను బతికుండగానే ఇంతపని చేశారా అంటూ నోరు వెల్లబెట్టింది. బాధితురాలు దుర్గమ్మ మాట్లాడుతూ.. నా భర్త కాకినాడలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, నా పేరు మీద అసైన్డ్ ల్యాండ్ పట్టా ఉందని తెలిపింది. ఆ భూమిని పట్టా చేయిస్తానని మా ఆడబిడ్డ కొడుకు మా భర్త డెత్ సర్టిఫికెట్ తీసుకెళ్లారని అన్నారు. నా దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని తెలిపారు. ఆ డెత్ సర్టిఫికెట్ లో పేరు మార్చి నా భూమి కాజేసేందుకు ప్లాన్ వేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!