Atrocity in Maharashtra: అయ్యో బిడ్డా ఆ నొప్పిని ఎలా భరించావురా! 11 మంది 10 గంటలు అత్యాచారం
Crime News: మహారాష్ట్రలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్లో మైనర్ బాలికపై 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ 11 మంది హంతకుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మిగిలిన ఆరుగురి కోసం సత్పతి సీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో పాల్ఘర్లో కలకలం రేగింది. నిందితుల్లో ఎక్కువ మంది డ్రగ్స్ మత్తులో ఉన్నారని ప్రచారం జరగుతోంది. పాల్ఘర్ జిల్లాలోని ఓ గ్రామంలో టీనేజీ బాలికపై 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం, శనివారం మధ్య రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పాల్ఘర్ జిల్లా రూరల్ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఇందులో నిందితులు బాలికను తొలుత సముద్ర తీరానికి తీసుకెళ్లి, ఆ తర్వాత బీచ్ గ్రామంలోని ఖాళీ బంగ్లాలో అత్యాచారం చేశారన్నారు. నిందితులపై సత్పతి పోలీస్ స్టేషన్లో సామూహిక అత్యాచారం కేసు నమోదైంది.
Read Also: Kolkata: మైనర్ బాలికపై కొడుకు అత్యాచారం.. సహకరించిన తల్లి..
Also Read
- AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
- Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
బాధితురాలు తెలిపిన వివరాలు.. డిసెంబర్ 16 రాత్రి 8 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు తనపై లైంగిక దాడి చేశారని తెలిపింది. నిందితులు తనను మహీమ్ గ్రామంలోని ఖాళీగా ఉన్న బంగ్లాకు తీసుకెళ్లారని, అక్కడ వారు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. తరువాత, వారు ఆమెను సముద్ర తీరానికి తీసుకెళ్లి, అక్కడ వారు మళ్లీ పొదల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. నిందితుల్లో చాలా మంది యువకులే. వీరంతా గార్డా (మత్తు పదార్ధం)కు బానిసలైన సంగతి కూడా తెలిసిందే. బాధిత మైనర్ బాలిక మాహిమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో సత్పతి సాగరి పోలీస్ స్టేషన్లో పోక్సో కింద కేసు నమోదైంది. ఈ మేరకు పాల్ఘర్ పోలీసు సూపరింటెండెంట్ బాలాసాహెబ్ పాటిల్ వెల్లడించారు. నిందితులంతా మహిమ్, హనుమాన్పాడ, టెంబి, సఫాలే, వడ్రాయ్ ప్రాంతాలకు చెందిన వారే. పోలీసులు వారిని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనతో పాల్ఘర్లో కలకలం రేగింది.
తాజావార్తలు
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
-
AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!