ఇంటర్ ఫలితాలపై విశ్లేషణ చేయాలంటున్న నిపుణులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల ప్రకటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందా? విద్యార్థుల్ని కనీస మార్కులతో పాస్ చేస్తే సమస్య పరిష్కారమైనట్టేనా? జరిగిన తప్పుల్ని సరిద్దిద్దుకునేది ఎలా?
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల సరళిపై విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాలను సీరియస్గా తీసుకోవాలని… ఫెయిలైన విద్యార్థుల్ని పాస్ చేసి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. ఫలితాలను అన్ని కోణాల్లో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
Also Read
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు పరిశీలిస్తే… ఫెయిలైన విద్యార్థులు దారుణంగా విఫలమైతే… పాస్ అయిన విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఇంటర్నెట్ అందుబాటులో లేక, ఆన్లైన్ తరగతులు అందుకోలేక ఫెయిలైన విద్యార్థులు నష్టపోతే… ఆన్లైన్ క్లాసుల్ని చక్కగా అందిపుచ్చుకున్న విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకున్నారు. 4 లక్షల 59 వేల 242 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే… 2 లక్షల 24 వేల 12 మంది పాస్ అయ్యారు. 2 లక్షల 35 వేల 230 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 49 శాతం పాస్ అయితే… 51 శాతం ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన వారిలో 51 శాతం మంది 75 శాతం కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారు. మరో 30 శాతం మంది 60 నుంచి 75 శాతం మధ్య మార్కులు తెచ్చుకున్నారు. అంటే పాసైన విద్యార్థుల్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్న వారు 80 శాతానికి పైగానే ఉన్నారు. పాసైన, ఫెయిలైన విద్యార్థుల అభ్యాసనంలో తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
విద్యార్థుల తప్పేమీ లేదని… డిజిటల్ టీచింగ్ ప్రభావం ఫలితాల్లో కనిపిస్తోందని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. ఎవరికైతే ఆన్లైన్ క్లాస్లు అందాయో వాళ్లు మంచి మార్కులు తెచ్చుకోగలిగారని, అందని వాళ్లు ఒకటి రెండు ప్రశ్నలకు కూడా సమాధానాలు రాయలేకపోయారని అంటున్నారు. ఎక్కువగా గ్రామీణ, పేద విద్యార్థులే నష్టపోయారని TSPSC మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. విద్యార్థులకు బ్లెండెడ్ మోడ్లో విద్య అందించాలని, ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోతే ఒక జనరేషన్పై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల చేశాక తలెత్తిన వివాదం తర్వాతైనా ప్రభుత్వం మేల్కొని… విద్యార్థుల భవిష్యత్ కోసం చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫెయిలైన వారిని పాస్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని… జాగ్రత్త పడకపోతే సెకండియర్లోనూ అలాంటి ఫలితాలే చూడాల్సి రావొచ్చని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Ragi Bellam Ariselu: పిల్లల ఎముకల బలానికి ఈ ఒక్క స్వీట్ చాలు.. సింపుల్గా ఇలా చేసేయండి!
-
Hyderabad Census : హైదరాబాద్లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!
-
Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
-
Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
-
Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?