Khammam: లోక్ సభ కౌంటింగ్ కు అంతా రెడీ.. స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర మూడంచెల భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Counting: ఖమ్మం పార్లమెంటు ఎన్నికకు సంబందించిన కౌంటింగ్ ఏర్పాట్లను అన్ని పూర్తిచేసినట్లుగా జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి గౌతమ్ చెప్పారు. పార్లమెంటు పరిదిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కు ప్రత్యేకంగా కౌంటింగ్ కేంద్రాలు అదే విదంగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక్క కౌంటింగ్ కేంద్రాన్ని మొత్తం ఎనిమిది రూమ్ లలో కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఖమ్మం అసెంబ్లీ పరిదిలో అత్యదికంగా ఓట్లు ఉన్నందున ఖమ్మం కౌంటింగ్ కేంద్రంలో 18 టేబుళ్లు , అదేవిదంగ తక్కువ ఓగట్లు ఉన్న అశ్వరావు పేట 14 టేబుల్లను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్న జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్ తెలిపారు. మొత్తం 35 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా, వారందరి తరపున 117 మంది ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
Read also: Mahbubnagar: లోక్ సభ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దం.. ఉత్కంఠకు రేపటితో తెర..
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
గత నెల 13న పోలింగ్ ముగియగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 16,31,039 మంది ఓటర్లకు గాను 12,41,135 మంది (76.09 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంల లెక్కింపు ఒకేసారి ప్రారంభమవుతుంది. ఇక ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో 35 మంది బరిలో నిలిచారు. ఇందులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరఫున రామసహాయం రఘురాంరెడ్డి, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ తరఫున తాండ్ర వినోద్రావు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో 20 మంది స్వతంత్రులు, 2019 ఎన్నికల్లో 13 మంది పోటీ చేశారు. ఈసారి మరో 24 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. వీరికి వచ్చే ఓట్లు ఎవరికి ఇబ్బందికరంగా మారతాయన్నది ఆసక్తికరం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Warangal: వరంగల్ లోకసభ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి..
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!