Site icon NTV Telugu

Etela Rajender: సంచలన వ్యాఖ్యలు.. తెరాస, కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది టచ్ లో ఉన్నారు..

Etala Rajender

Etala Rajender

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ఈటెల రాజేందర్‌. మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ జెండా ఎగురవేసి జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు ఈటల కు ఖడ్గం బహూకరించారు. పలువురికి ఈటల రాజేందర్ కాషాయ జెండా కప్పి బీజేపీ లోకి స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ ప్రజనికానికి శుభదినమన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఒక ఆదివాసీ మహిళను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి అణగారిన వర్గాల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో నరేంద్ర మోదీ నిరూపించుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలో కూడా సామాజిక న్యాయం పాటించారు. 70 శాతం మంది బడుగు బలహీన వర్గాల వారికి స్థానం కల్పించారు. అందుకే దేశ వ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి చేస్తా అని కెసిఆర్ మాట తప్పారని గుర్తు చేసారు. అనేక అంశాలు మానిఫెస్టోలో రాసుకొని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి కెసిఆర్ అంటూ తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ హామీలు, వైఫల్యాల ను ఎండగట్టేందుకు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా దేవరకద్ర వెళ్తున్నా అని అన్నారు.

read also: Elon Musk : మరోసారి రచ్చలేపిన ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలు..

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మాఆక్షన్ ప్లాన్ ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎగరేది బీజేపీ జెండానే అంటూ హర్షం వ్యక్తం చేసారు. ఇప్పుడు రోజులు బాగా లేవు, 27 తరువాత బీజేపీలో చేరికలు ఉంటాయని తెలిపారు. తెరాస కాంగ్రెస్ పార్టీ వారు చాలామంది టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ఈటెల. సీఎం మీద పోటీచేసుడే.. ఒడించుడే అంటూ సపథం చేసారు. దుర్మార్గ పాలన అంతం కావాలి అంటే.. ఎవరో ఒకరు కెసిఆర్ ను కొట్టాలి కదా అంటూ ఈటెల తెలిపారు. గజ్వేల్ లో నాకు తప్పకుండా ఆదరణ ఉంటుందని అన్నారు. కెసిఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మద్య పంచాయితీ అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్ ఎవరు కూడా కెసిఆర్ ను గుండెల్లో పెట్టుకొనే వారు లేరని, అందరి అభిమానాన్ని కోల్పోయారని విమర్శించారు. కాంగ్రెస్ ఢిల్లీ లో రాదు ఇక్కడ ఎడగదని ఎద్దేవ చేసారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే టీఆర్ఎస్ కి ఓటు వేసినట్టే అంటూ తీవ్ర విమర్శలు చేసారు. రాబోయే రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరినా వారిని ముందు ఉండి వాళ్ళను గెలిపిస్తా అన్నారు. హుజురాబాద్ ఫార్ములా ప్రకారం పనిచేస్తాఅంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుపతి కొండమీద కాంగ్రెస్ కి కెసిఆర్ ను ఎదుర్కొనే సత్తా లేదని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఆయన కెసిఆర్ మీద కసి తీర్చుకోవాలని చూస్తున్నారని, ఆ వేదిక బీజేపీ మాత్రమే అని ఆయన్ను ఆహ్వానిస్తున్నామని ఈటెల రాజేందర్‌ అన్నారు.

Elon Musk : మరోసారి రచ్చలేపిన ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలు..

Exit mobile version