Etela Rajender: ఇదంతా సీఎం కేసీఆర్ స్కెచ్.. ఇదో పిరికి చర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender Reacts On Assam CM Himantha Biswa Sarma Incident: గణేశ్ నిమజ్జనం ఉత్సవ కమిటీలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేత నందుబిలాల్ అడ్డుకున్న ఘటనను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. ఇదంతా సీఎం కేసీఆర్ కుట్రేనని ఆరోపించారు. ఇతర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని అవమానపరిచిన బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీన్నొక పిరికి చర్యగా అభివర్ణించిన ఆయన.. ప్రజల విశ్వాసం ఉన్న వాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడరని అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే ఇలాంటి దాడులకు దిగుతారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి పోయేకాలం వచ్చిందని, అందుకే గణేష్ నిమజ్జనం ఉత్సవాల సమయంలో ఇటువంటి పని చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని.. ఎవరు, ఏం చేస్తున్నారో అంత గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇటువంటి చర్యల్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారని తాను భావిస్తున్నానని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
చిల్లర మాటలు మాట్లాడటంలో సీఎం కేసీఆర్ని మించిన వారెవరూ లేరని ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యల్ని వినలేదని, అయితే ఆయన కేసీఆర్లాగా సంస్కారహీనంగా మాట్లాడి ఉండరని తెలిపారు. బాధ్యత మరిచి ఎవరూ వ్యవహరించరని తాను భావిస్తున్నానన్నారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ఈటెల విమర్శించారు. పోలీసుల సహకారం లేనిదే, ఇలాంటివి సాధ్యం కాదని ఆరోపణలు చేశారు. మన తెలంగాణలో పోలీస్ వ్యవస్థ గొప్పగా ఉందని వాళ్లే చెప్పుకుంటున్నారని, పోలీసుల వైఫల్యం వల్ల ఈ ఘటన జరిగిందని తాను చెప్పడం లేదని, కాకపోతే ప్రభుత్వమే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ చర్యకి పాల్పడి ఉంటుందని తాను భావిస్తున్నానన్నారు. దీనిపై కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
ఇదే సమయంలో తమిళిసై వ్యాఖ్యలపై స్పందిస్తూ.. గత రెండున్నరేళ్ల నుంచి కేసీఆర్ అవమానిస్తుండడం వల్లే ఆమె అలా వ్యాఖ్యానించారని అన్నారు. అయితే.. గవర్నరే తన చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. 2023 వరకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అపహాస్యం చేయకుండా ఉండాలని కేసీఆర్కు సూచించారు. ఈసారి ఎన్నకల్లో కేసీఆర్ ఓటమి తథ్యమని, ఆయనకు మంచి జరిగే ఆస్కారమైతే లేదని ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!