Etela Rajender: ఇదంతా సీఎం కేసీఆర్ స్కెచ్.. ఇదో పిరికి చర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender Reacts On Assam CM Himantha Biswa Sarma Incident: గణేశ్ నిమజ్జనం ఉత్సవ కమిటీలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేత నందుబిలాల్ అడ్డుకున్న ఘటనను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. ఇదంతా సీఎం కేసీఆర్ కుట్రేనని ఆరోపించారు. ఇతర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని అవమానపరిచిన బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీన్నొక పిరికి చర్యగా అభివర్ణించిన ఆయన.. ప్రజల విశ్వాసం ఉన్న వాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడరని అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే ఇలాంటి దాడులకు దిగుతారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి పోయేకాలం వచ్చిందని, అందుకే గణేష్ నిమజ్జనం ఉత్సవాల సమయంలో ఇటువంటి పని చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని.. ఎవరు, ఏం చేస్తున్నారో అంత గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇటువంటి చర్యల్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారని తాను భావిస్తున్నానని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
చిల్లర మాటలు మాట్లాడటంలో సీఎం కేసీఆర్ని మించిన వారెవరూ లేరని ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యల్ని వినలేదని, అయితే ఆయన కేసీఆర్లాగా సంస్కారహీనంగా మాట్లాడి ఉండరని తెలిపారు. బాధ్యత మరిచి ఎవరూ వ్యవహరించరని తాను భావిస్తున్నానన్నారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ఈటెల విమర్శించారు. పోలీసుల సహకారం లేనిదే, ఇలాంటివి సాధ్యం కాదని ఆరోపణలు చేశారు. మన తెలంగాణలో పోలీస్ వ్యవస్థ గొప్పగా ఉందని వాళ్లే చెప్పుకుంటున్నారని, పోలీసుల వైఫల్యం వల్ల ఈ ఘటన జరిగిందని తాను చెప్పడం లేదని, కాకపోతే ప్రభుత్వమే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ చర్యకి పాల్పడి ఉంటుందని తాను భావిస్తున్నానన్నారు. దీనిపై కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
ఇదే సమయంలో తమిళిసై వ్యాఖ్యలపై స్పందిస్తూ.. గత రెండున్నరేళ్ల నుంచి కేసీఆర్ అవమానిస్తుండడం వల్లే ఆమె అలా వ్యాఖ్యానించారని అన్నారు. అయితే.. గవర్నరే తన చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. 2023 వరకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అపహాస్యం చేయకుండా ఉండాలని కేసీఆర్కు సూచించారు. ఈసారి ఎన్నకల్లో కేసీఆర్ ఓటమి తథ్యమని, ఆయనకు మంచి జరిగే ఆస్కారమైతే లేదని ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!