Etela Rajender : విద్యార్థులకు ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు మరోసారి ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. అయితే వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అంత పెద్ద ఎత్తున నిరసనల తరువాత కూడా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ అయ్యింది అంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. సంక్షేమ హాస్టళ్లలో, రెసిడెన్సీయల్ క్యాంపస్ లలో భోజనం కలుషితమవుతున్న సంఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. నేను ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు డైట్ ఛార్జీలు ఎప్పటికప్పుడు అందించామని గుర్తు చేశారు.
Also Read
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ఇప్పుడు బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్స్ సరుకులు సరైనవి అందించడం లేదని ఆయన తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని, పేద విద్యార్థుల మీద ఉన్న చిన్న చూపు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా వారికి ఓటు హక్కు లేదని కావొచ్చు అంటూ ఎద్దేవా చేశారు ఈటల. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. అయితే గత మార్చి నెలలో కూడా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..