Etela Rajender : కేసీఆర్ వల్లే.. సింగరేణినికి దారిద్ర్య పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగరేణి కార్మిక చైతన్య యాత్ర ముగింపు సభలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిర్వహించిన సభలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన కూడా సింగరేణిని ఇంకా దారిద్య్ర పరిస్థితికి కారణం కేసీఆర్ అనే ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నన్ను టీఆర్ఎస్ పార్టీ నుండి మెడలు పట్టి బయటికి పంపించిందని, అయినా నాకు ఇంకో సారి తెలంగాణ కొరకు యుద్ధం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఈటల రాజేందర్ అన్నారు. నన్ను తగలపెట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ చివారికి మీరే తగలబడతారని హెచ్చరించారు.
అంతేకాకుండా.. ఒకప్పుడు 1 లక్ష 20 వేల కార్మికులు సింగరేణి సంస్ధలో పనిచేసేవారని.. తెలంగాణలో ప్రస్తుతం 43 వేల కార్మికులు మాత్రమే ఉన్నారన్నారు. కార్మికుల సంఖ్య తగ్గడానికి ముఖ్య కారణము కేసీఆరేనని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక కేవలం ఒక్క బొగ్గుగనికి మాత్రమే శంకుస్థాపన చేయడం దారుణమన్న ఈటల.. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయింది.. కేసీఆర్ ని బొందపెడితే తప్ప తెలంగాణ బాగుపడదన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!