పచ్చటి సంసారంలో కేసీఆర్ చిచ్చు పెడతారు.. ఈటల ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పచ్చటి సంసారంలో సైతం కేసీఆర్ చిచ్చు పెడతారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేని పద్ధతుల్లో ఇక్కడ పుడితే టీఆర్ఎస్లోనే ఉండాలి అని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.. ఉద్యోగాలు పీకేస్తాం అని, పెన్షన్, కళ్యాణ లక్ష్మీ రాకుండా చేస్తామని అంటున్నారట.. ఆపడం ఎవరికీ సాధ్యం కాదని హెచ్చరించారు. వీటికి ఇచ్చే డబ్బులు అన్నీ ప్రజలు కట్టే పన్నులేనని గుర్తుచేసిన ఆయన.. సీసాల మీద సంవత్సరానికి 30 వేల కోట్లు, రోజుకు 90 కోట్లు కడుతున్నాం అన్నారు. మనకు ఇచ్చేది పెన్షన్లకు 9 వేల కోట్లు, కళ్యాణ లక్ష్మికి 1500 కోట్లు ఖర్చు అవుతాయి… ఏవీ పుక్కట్కి ఇవ్వడంలేదని ఫైర్ అయ్యారు.
పెన్షలు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అప్పుడే ఉన్నాయి.. డబ్బులు అందరికీ వచ్చాయన్నారు ఈటల రాజేందర్.. నేను ఉన్నంత వరకు మీ పెన్షన్, రేషన్ కార్డ్, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, రైతు బంధు ఆగదన్నారు.. ఈటల రాజేందర్ ఓడిపోతే 20 ఏళ్లు వాళ్ల కుటుంబపాలన సాగుతుంది అని అనుకుంటున్నారు. దసరాకి మందు, మాంసం ఇచ్చారు.. ఓటుకు లక్ష ఇవ్వమని అడగండి అంటూ సూచించారు.. ఎంత ఇచ్చినా తీసుకోండి.. దళిత బంధు, పావలా వడ్డీ చెక్కులు, రోడ్డు, ఓటుకు డబ్బులు నా వల్ల వస్తున్నాయి.. తీసుకోండి.. కానీ, నన్ను మర్చిపోకండి. లిక్కర్ సీసాల వెనుక, దళిత బంధు వెనుక ఒక కత్తి ఇచ్చి పంపిస్తున్నారు. దానిని పెట్టి నన్ను పొడిచి రాజకీయంగా చంపాలని పంపిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలన్నారు.. మీకు నేను పేరు తెచ్చిన గౌరవం పెంచిన.. దానిని చెరిపే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి కులాలు, మతాలు కావు.. కెసిఆర్ డబ్బులు, సీసాలు, అహంకారం పేదల బ్రతుకుల మధ్య పోటీ అన్నారు ఈటల రాజేందర్.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!