Etela Rajender: మల్లారెడ్డిపై దాడి రైతులకు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేఖత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి మల్లారెడ్డిపై దాడి, వ్యక్తిగత దాడి కాదని.. ప్రభుత్వంపై రైతులకు ఉన్న వ్యతిరేఖత అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ నేతలు సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ను పిలవకున్నా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రధానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. కేసీఆర్ గెలవలేకనే పీకేను అరువు తెచ్చుకున్నాడని అన్నారు. సీఎం కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు అన్యాయం చేశారని ఆరోపించారు.
కేసీఆర్ రైతులకు రుణాలు మాఫీ చేయకుండా డీఫాల్టర్ గా మారారని విమర్శలు చేశారు. కేసీఆర్ కు పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని.. ఖజానాపై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన అహంకారానికి అద్దపడుతోందని అన్నారు. ఆయన ఆ స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని అన్నారు. కులం పునాదులపై ఏ పార్టీ సాగదని అన్నారు. విమర్శలు చేస్తే పోలీసులు వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ఇదిలా ఉంటే మంత్రి మల్లారెడ్డిపై ఆదివారం రెడ్డి ఘర్జణ యాత్రలో పాల్గొన్న సమయంలో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై దాడికి కాంగ్రెస్ కారణం అని, దీని వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడని ఆరోపించారు. ఈ ఘటనపై 16 మందిపై ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!