Errabelli Dayakar Rao: కేసీఆర్ తెలంగాణ గాంధీ.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అవ్వడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao On CM KCR: తెలంగాణ తెచ్చిన గాంధీజీ కేసీఆర్ అని, వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రధాని అవ్వడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వరంగల్లోని ఏజే మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన.. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిన మహానుభావుడు కేసీఆర్ అని, యావత్తు దేశం ఆయన కోసం ఎదురు చూస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం రాష్ట్ర ప్రజలందరికీ ఓ ఉత్సవం లాంటిదని.. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఇంటింటా కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణను సాధించారని, రాష్ట్రాన్ని తెర్లు కాకుండా దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. ఇవ్వాళ తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందని.. అందుకే దేశం కేసీఆర్ వైపు చూస్తోందని చెప్పారు.
Kishan Reddy.. విమానాశ్రయాల ఏర్పాటుపై కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, కేసీఆర్ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ భారీ మెజారిటీతో గెలుస్తారని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్లపై తీవ్రంగా మండిపడ్డారు. పిట్టల రాముడిలా పెగ్గెలు కొడుతున్నారని, వాళ్ళతో అయ్యేది లేదు పొయ్యేది లేదని కౌంటర్ వేశారు. కనీస మర్యాదలు.. పెద్దా, చిన్నా తేడా తెలవని మూర్ఖులని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ ఐరన్ లెగ్ అని.. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్ అని ఆరోపించారు. బండి సంజయ్ ఓ తొండి మనిషని.. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్లతో ఒరిగేదేమీ ఉండదని, వాళ్ళను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని దుయ్యబట్టారు.
Laya Gorty: హీరోయిన్ లయ కూతురును చూశారా.. అచ్చుగుద్దినట్లు తల్లిని దింపేసింది
రాష్ట్ర బడ్జెట్లో వైద్య, ఆరోగ్య శాఖకు భారీగా కేటాయింపులు చేశారని.. విద్య, వైద్య రంగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నామని తెలిపారు. వరంగల్లో రూ. 11 వందల కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని.. అందుకే ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని తెలియజేశారు. ప్రైవేట్ వైద్యులు కూడా కేవలం వ్యాపార ధోరణితో మాత్రమే ఆలోచించకుండా.. సేవా ధృక్పథంతో సేవ చేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!