Errabelli Dayakar Rao: కేసీఆర్ తెలంగాణ గాంధీ.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అవ్వడం ఖాయం
Errabelli Dayakar Rao On CM KCR: తెలంగాణ తెచ్చిన గాంధీజీ కేసీఆర్ అని, వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రధాని అవ్వడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వరంగల్లోని ఏజే మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన.. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిన మహానుభావుడు కేసీఆర్ అని, యావత్తు దేశం ఆయన కోసం ఎదురు చూస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం రాష్ట్ర ప్రజలందరికీ ఓ ఉత్సవం లాంటిదని.. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఇంటింటా కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణను సాధించారని, రాష్ట్రాన్ని తెర్లు కాకుండా దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. ఇవ్వాళ తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందని.. అందుకే దేశం కేసీఆర్ వైపు చూస్తోందని చెప్పారు.
Kishan Reddy.. విమానాశ్రయాల ఏర్పాటుపై కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, కేసీఆర్ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ భారీ మెజారిటీతో గెలుస్తారని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్లపై తీవ్రంగా మండిపడ్డారు. పిట్టల రాముడిలా పెగ్గెలు కొడుతున్నారని, వాళ్ళతో అయ్యేది లేదు పొయ్యేది లేదని కౌంటర్ వేశారు. కనీస మర్యాదలు.. పెద్దా, చిన్నా తేడా తెలవని మూర్ఖులని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ ఐరన్ లెగ్ అని.. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్ అని ఆరోపించారు. బండి సంజయ్ ఓ తొండి మనిషని.. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్లతో ఒరిగేదేమీ ఉండదని, వాళ్ళను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని దుయ్యబట్టారు.
Laya Gorty: హీరోయిన్ లయ కూతురును చూశారా.. అచ్చుగుద్దినట్లు తల్లిని దింపేసింది
రాష్ట్ర బడ్జెట్లో వైద్య, ఆరోగ్య శాఖకు భారీగా కేటాయింపులు చేశారని.. విద్య, వైద్య రంగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నామని తెలిపారు. వరంగల్లో రూ. 11 వందల కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని.. అందుకే ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని తెలియజేశారు. ప్రైవేట్ వైద్యులు కూడా కేవలం వ్యాపార ధోరణితో మాత్రమే ఆలోచించకుండా.. సేవా ధృక్పథంతో సేవ చేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
-
Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
-
May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!