ఉత్కంఠకు తెరదించుతూ తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరిగిన హోరాహోరీ పోరులో చివరకు అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థిని వరించింది. అయితే, తన రాజకీయ కంచుకోటగా భావించే తొర్రూరు మున్సిపాలిటీ చేజారిపోవడంతో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనై మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఇరు వర్గాల బలాబలాలు సమానంగా ఉండటంతో అధికారులు ‘లక్కీ డ్రా’ పద్ధతిని అనుసరించారు. ఈ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి, రెండో వార్డు సభ్యుడు శ్రవణ్ కుమార్ విజేతగా నిలిచారు. దీంతో ఎన్నికల అధికారి ఆయన పేరును అధికారికంగా ప్రకటించి పత్రాన్ని అందజేశారు. మున్సిపాలిటీని దక్కించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటుండగా, బీఆర్ఎస్ క్యాంప్లో విషాదం నెలకొంది.
Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్! బ్లాక్ బాక్స్ సమాచారంపై..!
తొర్రూరులో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తల కష్టాన్ని తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. “ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేను ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి?” అంటూ ఆయన కంటతడి పెట్టారు. నాయకులు కేసీఆర్ అంటే ప్రజల్లో ఎంత అభిమానం ఉన్నా, అధికార పార్టీ సాగిస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల వ్యవహారశైలిని ఎర్రబెల్లి తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారి పనిచేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే దీనికి ముగింపు పడుతుందని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా ‘జై తెలంగాణ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
Pathum Nissanka Record: పాతుమ్ నిశాంక అరుదైన రికార్డు.. రెండో లంక బ్యాటర్గా..!