Yadadri Power Plant: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలించిన భట్టి విక్రమార్క..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Power Plant: యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రుల బృందం శనివారం పవర్ ప్లాంట్ను సందర్శించింది. విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు బేగంపేట నుంచి హెలికాప్టర్లో వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్కు చేరుకున్నారు. వీరికి సీఎండీ రిజ్వీ, కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందన దీప్తి స్వాగతం పలికారు. ముందుగా ప్లాంట్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎండీ అతిథి గృహంలో ప్రాజెక్టు పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
Read also: Queen 2 : ‘క్వీన్’ సీక్వెల్కు కథ సిద్ధం..సీక్వెల్ లో కంగనా నటిస్తుందా..?
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రాజెక్టు పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రానున్న కాలంలో జరగాల్సిన పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అవకతవకలు, ఇంకా ఎంత మందికి పరిహారం అందాల్సి ఉందని మంత్రులు ఆరా తీశారు. మరోవైపు 800 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి చేసే 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 యూనిట్లలో ఈ ఏడాది చివరి నాటికి రెండు యూనిట్లను అందుబాటులోకి తెస్తామని జెన్కో సీఎండీ రిజ్వీ ప్రకటించారు. తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) యాదాద్రి థర్మల్ ప్లాంట్ పై ఈ నెల 20న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది.
UP : అతను ఊరికి పెద్ద మనిషి.. ఉద్యోగం ఇస్తానంటూ మూడేళ్లుగా అత్యాచారం..చివరకు
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!