Engineers Negligence: ఇంజనీర్ల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నపాటి నిర్లక్ష్యం ఒక్కోసారి జీవితాలను తలకిందులు చేస్తుంది. ఇంజనీర్ల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో చోటు చేసుకుంది. పాల్వంచ కేటిపిఎస్ 5వ దశ లోని 10వ యూనిట్ లో సాంకేతిక లోపం ఏర్పడటంతో యూనిట్ ట్రిప్ చేసి మరమ్మతులు చేయవలసి ఉండగా ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం ,తొందరపాటు చర్య వల్ల ఘోరం జరిగింది. ఆర్టిజన్ వలీ పాషా (28)కార్మికుడు ఈ ప్రమాదంలో మృతి చెందాడు.
Read Also: CM KCR: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
యూనిట్ ట్రిప్ అయిన తర్వాత మరమ్మతులు చేయవలసి ఉండగా బాయిలర్ ఇంజనీర్లు ట్రిప్ అయిన విషయాన్ని నిర్ధారించుకోకుండానే బాయిలర్ లోని ఎయిర్ ప్రీ హీటర్ వద్ద మాన్యువల్ డోర్ తెరిపించడంతో ఒకసారిగా వేడి గాలిదాటికి మాన్యువల్ డోర్ తీవ్రంగా వేగంగా ఛాతీ పై తగలటంతో రెండవ అంతస్తు నుంచి కిందపడి వలీ పాషా అనే ఆర్టిజన్ కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మృతికి గల కారణం ఇంజనీర్ల నిర్లక్ష్యం,అత్యుత్సాహం వల్ల ఒక నిండు ప్రాణం బలి అయిందని తోటి కార్మికులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
మృతి చెందిన గ్రేడ్ టూ ఆర్టిజన్ ఎస్.కె.వలీ పాషా కు వివాహం అయి భార్య, నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాద ఘటనతో వలీ పాషా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతి చెందిన కుటుంబానికి జెన్కో యాజమాన్యం న్యాయం చేయాలని,నిర్లక్ష్యం వహించిన ఇంజనీర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తోటి కార్మికులు. కేటీపీఎస్ కాంప్లెక్స్ లో ఈ రెండు నెలల్లో అధికారుల నిర్లక్ష్యానికి మృతి చెందిన ఘటన లో ఇది రెండవది. ఈ ప్రమాదాలలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Also: Manish Sisodia: నా బ్యాంకు లాకర్లలో సీబీఐకి ఏం దొరకలేదు.. అయినా నన్ను అరెస్ట్ చేస్తారు.
తాజావార్తలు
-
Ravi Teja : ‘ఇరుముడి’ తర్వాత రవితేజ డబుల్ ట్రీట్..
-
Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
-
NTRNEEL : నందమూరి ఫ్యాన్స్కు మిడ్ నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
-
Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ
-
IPL 2026: ఆర్సీబీ vs ముంబై మ్యాచ్లో బెంగళూరు ప్లేయర్ ఓవర్ యాక్షన్.. బిగ్ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?