Munugode bypoll: రేపే మునుగోడులో ప్రచారానికి తెర.. ఔటర్స్ ఖాళీ చేయాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టానికి తెరపడనుంది.. ప్రధాని పార్టీలకు చెందిన నేతలే కాదు.. చిన్న పార్టీల వారు కూడా పెద్ద సంఖ్యలో మునుగోడులో మొహరించారు.. అద్దెకు ఇళ్లు కూడా దొరకని పరిస్థితి.. చివరకు తాత్కాలిక గూడారాలు కూడా ఏర్పాటు చేసి తమ నేతలు, కార్యకర్తలకు ఆశ్రయం కల్పిస్తున్నారు వివిధ పార్టీల నేతలు.. అయితే, ఇక మునుగోడు మొత్తం ఖాళీ కానుంది.. ఎందుకంటే.. రేపు మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనుంది.. హైదరాబాద్లోని బుద్ధ భవన్లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్.. రేపు సాయంత్రం 6 గంటలకు మునుగోడులో ప్రచారం ముగుస్తుందని తెలిపారు.. ఇక, నవంబర్ 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
Read Also: Telangana Police : 13మంది తెలంగాణ పోలీసులకు స్పెషల్ ఆపరేషన్ మెడల్స్
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,41,000 ఓటర్లు ఉండగా.. ఉప ఎన్నికలో 298 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం.. అందులో అర్బన్ ప్రాంతంలో 35 పోలింగ్ స్టేషన్లు ఉంటే.. రూరల్లో 263 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని.. కొత్త ఓటర్ కార్డులు ఇచ్చాం.. అన్ని పోలింగ్ స్టేషన్ లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు వికాజ్ రాజ్.. 105 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామని తెలిపారు. ఇక, నవంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడుతుందని.. ఆ తర్వాత మునుగోడులో ఓటు హక్కు లేనివాళ్లు మునుగోడులో ఉండకూడదని స్పష్టం చేశారు. మరోవైపు.. ఇప్పటి వరకు మునుగోడులో 185 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.. రూ.6.80 కోట్ల క్యాష్ సీజ్ చేశాం.. 4,683 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నాం.. రాజకీయ పార్టీల నాయకుల నుంచి కూడా వచ్చిన ఫిర్యాదులు కలుపుకుంటే 479 ఫిర్యాదులు వచ్చాయన్నారు.. అంటే, రేపు సాయంత్రం 6 గంటలకు మైక్లు మూగబోనున్నాయి.. ప్రచార హోరు ఆగిపోయి ప్రలోభాలకు తెరలేసే అవకాశం ఉంది… మరోవైపు.. సోషల్ మీడియాలో కూడా రేపు సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికల ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు వికాస్ రాజ్..
ఇక, మునుగోడులో ప్రచారం ముగిసిన తర్వాత.. ప్రలోభాల పర్వం తెరలేసే అవకాశం ఉండడంతో.. ఎన్నికల సంఘం గట్టి నిఘా ఏర్పాట్లు చేస్తోంది.. ఇప్పటికే విచ్చలవిడిగా డబ్బులు పంచారని.. మద్యం ఏరులై పారుతుందనే ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.. ప్రచారం ముగిసిన తర్వాత ఇది మరింత ఊపందుకునే అవకాశం లేకపోలేదు.. ఒకరిని ఒకరు దూషించుకుంటున్నా.. చిన్న చితక పార్టీలు మినహాయిస్తే.. ఎన్నికల బరిలో ఉన్న అన్ని పార్టీలు జోరుగా డబ్బులు పంచుతున్నాయని.. మద్యం పంచుతున్నాయని.. ప్రచారంలో పాల్గొన్నవారికి ఓవైపు మద్యం.. మరోవైపు నాన్వెజ్తో భోజనాలు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!