టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. మరింత దూకుడుగా ఈడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు మరింత ముమ్మరం చేయనుంది. గత 20 రోజులుగా మనీలాండరింగ్ కేసలో దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. విదేశాల నుండి డ్రగ్స్ దిగుమతి చేసిన కెల్విన్ బ్యాంక్ ఖాతాలతో నటుల స్టేట్ మెంట్లను పరిశీలించింది. ఎక్సైజ్ శాఖ విచారణలో ఇప్పటికే 16 మంది సెలబ్రిటీలకు క్లిన్ చిట్ దక్కింది. అయితే ఎక్సైజ్ విచారణతో సంబంధం లేకుండా ఈడీ దర్యాప్తు కొనసాగించింది. ఇక, ఇవాళ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తరుణ్ విచారణ ముగిసింది. ఈడీ కార్యాలయంలో 8 గంటల పాటు తరుణ్ను విచారించారు అధికారులు. నేటితో డ్రగ్స్ కేసులో సినీతారల విచారణ ముగిసింది. తన బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్లతో హాజరయ్యారు 12 మంది సినీ సెలబ్రిటీలు.
పూరి జగన్నాథ్తో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభమయ్యింది. తరుణ్తో ఈ విచారణ ముగిసింది. ఆగస్ట్ 31 న పూరి జగన్నాథ్ను 10 గంటల పాటు విచారించింది ఈడి. ఈనెల 2న ఛార్మినీ 8 గంటల పాటు విచారించారు అధికారులు. అయితే ఈనెల 6న రకుల్ హాజరు కావాల్సి ఉండగా.. 3వ తేదీనే విచారణకు వెళ్లింది. 6 గంటలపాటు రకుల్ను విచారించారు అధికారులు. ఇక 20వ తేదీన హాజరు కావాల్సిన నందు ఈనెల 7న విచారణకు వచ్చారు. అదే రోజు కెల్విన్ , జీశాన్ల ఇళ్లలో సోదాలు చేసి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు అధికారులు. 8వ తేదీన రానాను విచారించారు. అయితే రానా, నందు విచారణకు హాజరైన రోజుల్లోనే కెల్విన్, జీశాన్లను కలిపి విచారించింది ఈడీ. ఈనెల 9న రవితేజతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ను.. 13న నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ను ప్రశ్నించారు. 15 న ముమైత్ ఖాన్.. సెప్టెంబర్ 17న తనీష్ను 7 గంటల పాటు విచారించారు అధికారులు. అయితే, విచారణకు తమ చార్టెడ్ అకౌంటెంట్లను తీసుకొచ్చారు పలువురు తారలు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- Tags
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!