Duvvada, Madhuri : అందుకే పార్టీకి వెళ్లాం.. ఫామ్హౌస్ పార్టీ వ్యవహారంపై దువ్వాడ, మాధురి క్లారిటీ
- ఫామ్హౌస్ పార్టీపైనా దువ్వాడ–మాధురి క్లారిటీ
- బిజినెస్ మీట్ మాత్రమే, బర్త్డే కాదు
- లిక్కర్ ఉందని అంగీకారం, లైసెన్స్ తెలియదని వివరణ
- నెగిటివ్ పబ్లిసిటీ అవసరం లేదని దువ్వాడ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada, Madhuri : హాట్ టాపిక్ గా మారిన ఫామ్హౌస్ పార్టీ వివాదంపై దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి స్పందించారు. ఎన్టీవీతో వారు మాట్లాడుతూ.. పార్థు అనే స్నేహితుడి పార్టీకి పిలిస్తే వెళ్లామని, అక్కడ బిజినెస్ ఎక్స్పన్షాన్ గురించి మాత్రమే పార్టీ జరిగిందని వివరించారు. పార్టీలో లిక్కర్ ఉన్న మాట వాస్తవేమనని, కానీ.. పార్టీ నిర్వహించేందుకు లైసెన్స్ తీసుకోలేదని విషయం పోలీసులు వచ్చాక తెలిసిందని దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. పార్టీకి లైసెన్స్ లేదని తెలియడంతో అక్కడినుంచి వచ్చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే తాను పార్టీ మద్యం సేవించలేదని.. అది కేవలం బిజినెస్ పార్టీ మాత్రమేనని ఆయన వివరించారు. అయితే దివ్వెల మాధురి బర్త్ డే సందర్భంగా పార్టీ నిర్వహించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. మాధురి బర్త్డే ఈరోజు అని, పార్టీ జరిగిందిన నిన్న (11వ తేదీన) అని ఆయన తెలిపారు. ఒకవేళ బర్త్ డే పార్టీ నిర్వహించాలనుకుంటే దాని ప్రొసీజర్ తెలుసు అని.. గతంలో కూడా మాధురి కూతురు ఫంక్షన్ నిర్వహించనప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే చేశామన్నారు.
Union Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర క్యాబినెట్..
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
బర్త్డే కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అనే దానిపై మాట్లాడుతూ.. పుట్టినరోజు గురించి ప్రచారం చేసుకోవాలనుకుంటే.. తమకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారని సోషల్ మీడియాలో మరో విధంగా ప్రచారం చేసుకుంటాం కానీ.. ఇలాంటి నెగిటీవ్ పబ్లిసిటీ చేసుకోమని వారు క్లారిటీ ఇచ్చారు. ఇక హైదరాబాద్లోనే స్థిరపడడంపై మాట్లాడుతూ.. తెలంగాణలో బట్టల వ్యాపారం చాలా బాగాసాగుతోందని, త్వరలోనే గోల్డ్ బిజినెస్ కూడా ఇందులోకే తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు దువ్వాడ శ్రీనివాస్. ఏపీలో రాజకీయంగా బాగానే ఉందని.. వారంలో మూడునాలుగు రోజులు టెక్కలి నియోజకవర్గంలోనే ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తే టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి సానుభూతి వచ్చేందుకు అవకాశం ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు మాధురి బర్త్ డే సందర్భంగా ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేశామని.. అంతేకానీ పబ్లిసిటీ కోసం ఫామ్హౌస్ పార్టీలు చేసి నానాహంగామా చేసుకోమని మరోసారి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!