సీఎం కేసీఆర్ పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీని తిట్టడానికి అధికార వేదికలు వాడుకోవద్దని సూచనలు చేసిన రఘనందన్… కేసీఆర్ భాషను నియంత్రించుకోవాలని సూచించారు. యాక్షన్ కు రియాక్షన్ కూడా వస్తోందని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం తెలంగాణ సమాజానికి సిగ్గుచేటు అని.. దుబ్బాక భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు బయలు దేరాడని ఎద్దేవా చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేను దుబ్బాక ఎమ్మెల్యే కూడా తిట్టగలడని చురకలు అంటించారు.
read also : తెలంగాణ ప్రభుత్వంపై తీరుపై ఏపీ మంత్రి ఫైర్ !
తమ పీఠాలు కదులుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పష్టంగా అర్థమవుతోందని.. ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకొస్తే నీటి పంపాలకు తేల్చటానికి కేంద్రం సిద్ధమన్నారు. NREGS నిధులతో రైతు వేదికలు నిర్మించారని… రైతు వేదికలను ఏ ఒక్కరూ విమర్శించలేదన్నారు. రైతు వేదికల్లో కేంద్రం వాటా, రాష్ట్రం వాటా ఎంత ? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులతో వైకుంఠదామాల నిర్మాణాలు చేపట్టారని..హరిత హారం కింద ఖర్చు చేసే ప్రతిపైసా కేంద్రం ఇచ్చిందేనన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఉందని.. రైతు బంధుని ఎవరు వ్యతిరేకించలేదని తెలిపారు.