Drug Sales in Hyderabad: పాతబస్తీలో డ్రగ్స్ పట్టివేత.. సాఫ్ట్వేర్లతో పాటు ప్రముఖులకు సరఫరా
- పాతబస్తీ బహదూర్పూర్లో డ్రగ్స్ పట్టివేత
- బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న దంపతులు
- నాలుగేళ్లుగా డ్రగ్స్ను అమ్ముతున్న సయ్యద్ దంపతులు
- రేవ్ పార్టీలతో పాటు పబ్బులకు డ్రగ్స్ సరఫరా
- సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పాటు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug Sales in Hyderabad: పాతబస్తీ బహదూర్పూర్లో డ్రగ్స్ పట్టివేత సంచలనంగా మారింది. బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ కు చెందిన దంపతులు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్లో సయ్యద్, ఊన్నీసాలే నిందితులు పరిచయమయ్యారు. నాలుగేళ్లుగా సయ్యద్ దంపతులు డ్రగ్స్ను అమ్ముతున్నారు. రేవ్ పార్టీలతో పాటు పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పాటు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. 3 నెలల్లో 19 మంది ప్రముఖులకు సయ్యద్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. ట్రాన్స్ఫోర్ట్ ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. గతంలోనూ సయ్యద్ దంపతులు పలుమార్లు అరెస్టైనట్లు గుర్తించారు. సయ్యద్ దంపతులతో పాటు మరో నలుగురిని టీఎస్ న్యాబ్ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Read also: Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరగా పంపిణీ చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
భాగ్య నగరంలో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఉక్కుపాదం మోపుతున్నా.. డ్రగ్ రాకెట్లు బయటపడుతూనే ఉన్నాయి. మత్తుకు బానిసగా మారిన యువత ను టార్గెట్ చేసుకున్న మాఫియా.. చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారు.. డబ్బుల కోసం భావితరాల యువతను నాశనం చేస్తున్నారు.. ఉడుకు రక్తం యువత ఆ మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు దేశ ద్రోహులుగా కూడా మారుతున్నారు.. కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలకు యువతను బానిసలుగా మారుస్తున్నారు..
Read also: Rajanna Sircilla: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా..
మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటున్నారు పోలీసులు, నిపుణులు. దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత డ్రగ్స్ మాయలో పడటం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం కోసమే హైదరాబాద్ పోలీసులు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఒకవేళ డ్రగ్స్ కేసులో దొరికితే జీవిత ఖైదు, లేదా ఉరి శిక్షలు ఉంటాయాన్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా అధికారుల మాటలు పక్కనపెట్టి యువత డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగిస్తుంది. ఇటువంటి ఘటన పాతబస్తీ బహదూర్ పూర్ లో చోటుచేసుకుంది.
Virat Kohli: ఐపీఎల్లో రెచ్చిపోయాడు.. ప్రపంచకప్లో తేలిపోయాడు! కోహ్లీకి ఏమైంది?
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!