Bandi Sanjay: తెలంగాణలో కూడా గుజరాత్ ఫలితమే పునరావృతమవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: గుజరాత్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వాన్ని ఓడించక తప్పదన్నారు. అభివృద్ధి చేసే వారే గెలుస్తారని బండి సంజయ్ అన్నారు. అవినీతిపరులు పతనం అవుతారని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో
బండి సంజయ్ పాదయాత్ర 11వ రోజు కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్ విడి నుండి బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర” ప్రారంభమైంది. ఈ పాదయాత్ర సిర్పూర్, నడికుడ, రాఘవపేట, హుస్సేన్ నగర్, ముత్యంపేట మీదుగా వేంపేట వరకు కొనసాగనుండగా.. బండి సంజయ్ వేంపేట సమీపంలో రాత్రి బస చేయనున్నారు. బండి సంజయ్ పాదయాత్ర ఈరోజు మొత్తం 12.6 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈసందర్బంగా మాట్లాడుతూ.. గుజరాత్ లో గతంలో కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి సంతోషంగా ఉందని అన్నారు.
Read also: Dhamaka: ఇది మాస్ మహారాజ ఊరమాస్ జాతర…
Also Read
ఫలితాల కోసం ప్రపంచం దృష్టంతా గుజరాత్ మీదే ఉందని తెలిపారు. అన్ని పార్టీలు ఒకటై మోడీ గారి ఇమేజ్ను బ్యాడ్ చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు. బీజేపీకి అధికారం ఇస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయో గుజరాత్ ఫలితాలు తెలుపుతున్నాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రాబోయే రోజుల్లో విజయ పరంపర కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుజరాత్ గురించి చాలాసార్లు మాట్లాడారు ఏమి అభివృద్ధి అని అన్నాడు స్పందన చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. మునుగోడులో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేసిన మెజార్టీ లేదని బం సంజయ్ పేర్కొన్నారు.
Girlfriend Attacks Boyfriend: సీన్ రివర్స్.. ప్రియుడ్ని బ్లేడ్ తో దాడిచేసిన ప్రియురాలు
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..