Double Decker Skyway: పోలా అదిరిపోలా.. పైన మెట్రో.. మధ్యలో ఫ్లైఓవర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Decker Skyway: హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అనేక అంతర్జాతీయ కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. నగరంలో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉండడంతో విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల పరంగా నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, స్కైవేలు, స్టీల్ బ్రిడ్జిలు నిర్మించారు. ఇటీవల శంషాబాద్ నుంచి నాగోల్ వరకు మూసీ నదిపై స్కైవే నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తాజాగా నగరానికి వరంగా మారే మరో ప్రతిపాదన సిద్ధమైంది. జూబ్లీ బస్టాండ్ (జేబీఎస్) నుంచి సమీర్పేట మధ్య డబుల్ డెక్కర్ స్కైవే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్మాణంతో హైదరాబాద్ – కరీంనగర్ మార్గంలో ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా సాగుతుంది.
Read also: Pawan Kalyan: ‘బ్రో’ ట్రైలర్ టాక్… మనల్ని ఎవడ్రా ఆపేది
Also Read
- Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
- KTR: "రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా".. సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
తాజాగా ఈ స్కైవే ప్రతిపాదన కేంద్రం వద్ద పెట్టగా.. సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ వెల్లడించారు. డబుల్ డెక్కర్ స్కైవే మూడు మెట్లు ఉంటాయన్నారు. పైభాగంలో మెట్రో రైలు, మధ్యలో ఫ్లైఓవర్, దిగువన రోడ్డు ఉంటుందని తెలిపారు. ఈ డబుల్ డెక్కర్ స్కైవే పనులు పూర్తయ్యే నాటికి రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వినోద్ కుమార్ వెల్లడించారు. కరీంనగర్ మార్గంలో జేబీఎస్ నుంచి సమీర్పేట వరకు 18.5 కిలోమీటర్ల పొడవున డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ స్కైవే నిర్మాణంతో సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలు హైదరాబాద్ కు సాఫీగా ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీలు రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డితో చర్చించినట్లు వినోద్కుమార్ వెల్లడించారు. వీరి చర్చల ఫలితంగా ఈ ప్రతిపాదన ఓ కొలిక్కి వచ్చినట్లు వెల్లడించారు.
NTR: రక్తపాతం సృష్టిస్తున్న సముద్ర వీరుడు…
తాజావార్తలు
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Zeptoలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?