DOST Seat allotment: నేడు దోస్త్ సీట్ల కేటాయింపు.. మొదటి విడతలో 78 వేల మందికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DOST Seat allotment: తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(DOST) ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి విడత సీట్ల కేటాయింపును చేపట్టనున్నారు. దోస్త్ లో వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 78 వేల మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపును చేస్తారు.
Read also: Morning Tips : ఉదయాన్నే లేవాలంటే బద్దకంగా ఉందా.. ఇలా చేయండి
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర వ్యాప్తంగా దోస్త్ ద్వారా రిజిష్ర్టేషన్లను మే 16 నుంచి ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక లక్షా 5 వేల మంది దోస్త్ ద్వారా రిజిష్ర్టేషన్లు చేసుకున్నారు. వారిలో సుమారు 96 వేల మంది తమ వివరాలతో దరఖాస్తులను అప్లోడ్ చేసుకున్నారు. వివరాలను అప్లోడ్ చేసిన వారిలో తమకు ఏ కాలేజీలో, ఏ గ్రూపులో సీటు కావాలో పేర్కొంటూ సుమారు 78 వేల మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి నేడు సీట్ల కేటాయింపును చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సీట్ల కేటాయింపును తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, దోస్త్-2023 కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ప్రకటించనున్నారు. 2016 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీలో చేరాలంటే కాలేజీల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే తమకు నచ్చిన గ్రూపులో, నచ్చిన కాలేజీలో చేరడానికి దోస్త్ ను ప్రవేశ పెట్టారు. అయితే విద్యార్థులు ఇంటర్ లో వారు సాధించిన మార్కుల ఆధారంగా రిజిర్వేషన్ల మేరకు వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చిన కాలేజీల్లో సీట్ల కేటాయింపును చేస్తారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపును చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!