DOST Seat allotment: నేడు దోస్త్ సీట్ల కేటాయింపు.. మొదటి విడతలో 78 వేల మందికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DOST Seat allotment: తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(DOST) ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి విడత సీట్ల కేటాయింపును చేపట్టనున్నారు. దోస్త్ లో వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 78 వేల మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపును చేస్తారు.
Read also: Morning Tips : ఉదయాన్నే లేవాలంటే బద్దకంగా ఉందా.. ఇలా చేయండి
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
రాష్ట్ర వ్యాప్తంగా దోస్త్ ద్వారా రిజిష్ర్టేషన్లను మే 16 నుంచి ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక లక్షా 5 వేల మంది దోస్త్ ద్వారా రిజిష్ర్టేషన్లు చేసుకున్నారు. వారిలో సుమారు 96 వేల మంది తమ వివరాలతో దరఖాస్తులను అప్లోడ్ చేసుకున్నారు. వివరాలను అప్లోడ్ చేసిన వారిలో తమకు ఏ కాలేజీలో, ఏ గ్రూపులో సీటు కావాలో పేర్కొంటూ సుమారు 78 వేల మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి నేడు సీట్ల కేటాయింపును చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సీట్ల కేటాయింపును తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, దోస్త్-2023 కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ప్రకటించనున్నారు. 2016 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీలో చేరాలంటే కాలేజీల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే తమకు నచ్చిన గ్రూపులో, నచ్చిన కాలేజీలో చేరడానికి దోస్త్ ను ప్రవేశ పెట్టారు. అయితే విద్యార్థులు ఇంటర్ లో వారు సాధించిన మార్కుల ఆధారంగా రిజిర్వేషన్ల మేరకు వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చిన కాలేజీల్లో సీట్ల కేటాయింపును చేస్తారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపును చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!