Mancherial Hospital: మంచిర్యాలలో దారుణం.. పొట్టలో దూదిపెట్టి కుట్లు వేసిన డాక్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mancherial Hospital: మంచిర్యాలలోని ప్రభుత్వం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉద్రిక్తతకు దారి తీసింది. లయా అనే గర్భిణి పురుటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో దూదిను మరిచిపోయారు. ఇంటికి వెళ్లిన లయా మూత్ర విసర్జన చేయడం, కడుపులో నొప్పి రావడంతో అస్వస్థతకు గురై, మరో ఆస్పత్రికి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది.
Read also: Weather Update: మళ్లీ వర్షాలు.. ఆ రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్..
Also Read
- KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
వివరాల్లోకి వెళితే.. ఐదు రోజుల క్రితం వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయకు కడుపునొప్పి రావడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయింది.. కీర్తి లయ పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె కడుపులో దూదిని వదిలేసి కుట్లు వేశారు. దీంతో కీర్తి లయ తీవ్ర అస్వస్థతకు గురైంది. సోమవారం రాత్రి ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చెన్నూరు ఆస్పత్రికి తరలించారు. కీర్తి లయకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో దూది ఉన్నట్లు గుర్తించారు. తర్వాత ఆపరేషన్ చేసి దూదిని బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీకి వస్తే ప్రాణాలు తీస్తారా? అంటూ మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యంపై మీడియాలో కథనాలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
Read also: Bangalore: శాస్త్రవేత్తను కత్తులతో వెంబడించిన గుండాలు.. కారు అద్దం పగులగొట్టి ఆపై..
నాగర్ కర్నూల్ లో.. వారం రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ప్రసవం తర్వాత ఆమె చనిపోయింది. శస్త్రచికిత్సతో ఆమె కడుపులో పత్తి మిగిలిపోయింది. ప్రసవం రోజున వైద్యులు ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సమయంలో, వైద్యులు దూదిని తీయడం మర్చిపోయి కడుపులోనే పెట్టి కుట్లు వేశారు. కొన్ని రోజుల తర్వాత, ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆపరేషన్ జరిగిన వారం తర్వాత మహిళకు తీవ్ర రక్తస్రావం మొదలైంది. ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
NTR Devara: సముద్రగర్భంలో యుద్ధం… యంగ్ టైగర్ సిద్ధం!
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!