DK Aruna: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఒక బోగస్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే ఒక ప్రారంభించి మహబూబ్ నాగర్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అంచనాలు పెంచి లక్షల కోట్లు దంచుకోవడానికి ప్రాజెక్ట్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి కానీ ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు నీకు సిగ్గు అనిపించడం లేదా కెసిఆర్? అని ప్రశ్నించారు. తెలంగాణలో విప్లవం ప్రారంభం అయింది మిస్టర్ కేసీఆర్ అని అరుణ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించారని మండిపడ్డారు. సెంటిమెంట్ తో కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలిగొన్నారని ఆరోపించారు. 12వందల మంది ఉసురుపోసుకొని కేసీఆర్ గద్దెనెక్కారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్.. నిరుద్యోగులుగానే ఉంచారని మండిపడ్డారు. నిరుద్యోగ ఆశలను కేసీఆర్ నెరవేర్చలేదని అన్నారు. ఇప్పటి వరకు డిఎస్సీ వేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని గుర్తు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోలేదంటే ప్రభుత్వం హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకు నడుస్తుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు లబ్ధి పొందేందుకు అనేక ప్రకటనలు ఇస్తున్నారని అన్నారు. ప్రకటనల పేరుతో పాలాభిషేకాలు చేయించుకోవడానికి కేసీఆర్ కు సిగ్గు ఉండాలని అన్నారు. తెలంగాణ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తావు కేసీఆర్ ? అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, రెండు పడక గదుల ఇళ్లు ఎక్కడికి పోయాయి కేసీఆర్? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసిన కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్ అని అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలు పెంచి.. అడ్డగోలుగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మీకు సిగ్గు లేదా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విప్లవం మొదలైంది కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో మార్పు జరగాలి.. అదే బీజేపీ తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు.
Cheating boyfriend: ప్రేమించి మోసపోయింది.. చివరకు ప్రాణం తీసుకుంది
Also Read
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
తాజావార్తలు
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!