DK Aruna: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
DK Aruna: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఒక బోగస్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే ఒక ప్రారంభించి మహబూబ్ నాగర్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అంచనాలు పెంచి లక్షల కోట్లు దంచుకోవడానికి ప్రాజెక్ట్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి కానీ ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు నీకు సిగ్గు అనిపించడం లేదా కెసిఆర్? అని ప్రశ్నించారు. తెలంగాణలో విప్లవం ప్రారంభం అయింది మిస్టర్ కేసీఆర్ అని అరుణ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించారని మండిపడ్డారు. సెంటిమెంట్ తో కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలిగొన్నారని ఆరోపించారు. 12వందల మంది ఉసురుపోసుకొని కేసీఆర్ గద్దెనెక్కారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్.. నిరుద్యోగులుగానే ఉంచారని మండిపడ్డారు. నిరుద్యోగ ఆశలను కేసీఆర్ నెరవేర్చలేదని అన్నారు. ఇప్పటి వరకు డిఎస్సీ వేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని గుర్తు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోలేదంటే ప్రభుత్వం హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకు నడుస్తుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు లబ్ధి పొందేందుకు అనేక ప్రకటనలు ఇస్తున్నారని అన్నారు. ప్రకటనల పేరుతో పాలాభిషేకాలు చేయించుకోవడానికి కేసీఆర్ కు సిగ్గు ఉండాలని అన్నారు. తెలంగాణ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తావు కేసీఆర్ ? అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, రెండు పడక గదుల ఇళ్లు ఎక్కడికి పోయాయి కేసీఆర్? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసిన కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్ అని అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలు పెంచి.. అడ్డగోలుగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మీకు సిగ్గు లేదా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విప్లవం మొదలైంది కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో మార్పు జరగాలి.. అదే బీజేపీ తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు.
Cheating boyfriend: ప్రేమించి మోసపోయింది.. చివరకు ప్రాణం తీసుకుంది
Also Read
- Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?
- Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
- Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
తాజావార్తలు
-
Redmi Note 17 Pro Max: 200MP కెమెరా + 10,000mAh బ్యాటరీ.. Redmi Note 17 Pro Max షాక్ ఇస్తున్న లీక్లు
-
Royal Enfieldకు పోటీగా Yezdi Scrambler 350.. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే!
-
Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..
-
Donald Trump: ట్రంప్ వర్సెస్ నాటో.. మిత్రదేశాలకు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం!
-
IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!