DK Aruna: కేసీఆర్ ఫ్యామిలీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మరోసారి కేంద్రం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. కార్వాన్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. కంటోన్మెంట్లో చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోందన్నారు.. ఇక, శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదనన్ ఆయన. ఇలా కంటోన్మెంట్, ఏఎస్ఐ అభివృద్ధికి అడ్డు పడుతోందని మండపడ్డారు.. ఇది మంచి పద్ధతి కాదని, కంటోన్మెంట్ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తామని ప్రకటించారు.. ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్ చేస్తాం.. నాలాల మీద చెక్ డ్యాంలు కడుతామంటే చూస్తూ ఊరుకోబోమని.. అవసరమైతే కంటోన్మెంట్కు మంచినీళ్లు, కరెంట్ బంద్ చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.. అయితే, ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ..
Read Also: World’s Longest Car: కారంటే ఇదేరా..! సిమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ ఇంకెన్నో..
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!
- Mu*rder: బాలాపూర్లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో పెట్టిన ప్రియుడు
- Medico Suicide: ఉప్పల్లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
రక్షణశాఖ ప్రాంతమైన కంటోన్మెంట్లో విద్యుత్, నీటి సరఫరా నిలిపివేస్తామని, మంత్రి కేటీఆర్ సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడుతూ రక్షణ శాఖ అధికారులను హెచ్చరించడం సిగ్గుచేటని, అసలు కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు డీకే అరుణ.. అసలు రక్షణ శాఖ ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరా బంద్ చేయడానికి ఈ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా? అని ప్రశ్నించిన ఆమె.. భారత్ చైనా సరిహద్దు ప్రాంతం నుంచి దేశ సైనికులు తోక ముడ్చుకొని వచ్చారని, రక్షణ శాఖపై గతంలో సీఎం కేసీఆర్ హేళన చేయడం, స్వయంగా ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ కవిత , కాశ్మీర్ భారత దేశంలో భాగం కాదు అని దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం వెనుక అసలు రహస్యం ఏమిటని ప్రశ్నించారు. దేశ సరిహద్దులో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న సైనికులకు మద్దతుగా నిలవడం మరిచి, వారిపై అవాకులు చవాకులు మాట్లాడాం కల్వకుంట్ల కుటుంబం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డ డీకే అరుణ. ఇటువంటి దేశ వ్యతిరేకులు దేశం విడిచి వెళ్లిపోతే భరతమాతకు వీరి భారం తగ్గుతుందని వ్యాఖ్యానించారు.
- Tags
- bjp
- DK Aruna
- Kavitha
- kcr
- KCR Family
తాజావార్తలు
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన!
-
Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
-
Dharani I Love You: సెంటిమెంట్ పాటను ఆలపించిన పట్నాయక్.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణ!
ట్రెండింగ్
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!