Dharmapuri Arvind: కిషన్ రెడ్డి పార్టీకి లక్కీ హ్యాండ్.. 2024లో మోడీ మూడోసారి పీఎం అవుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmapuri Arvind Says Kishan Reddy Is Lucky Hand To BJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తమ బీజేపీకి లక్కీ హ్యాండ్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కొనియాడారు. కిషన్ రెడ్డి ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని, ఆయన్ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. 2024లో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్వింద్ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్కు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు గాను జేపీ నడ్డాకు కృతజ్ఞతలు చెప్పారు. ఈటల తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్గా వెళ్తారని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. బండి సంజయ్ అగ్రెసివ్గా తన టర్మ్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారని అన్నారు.
Sharad Pawar: ద్రోహం చేసిన వారు నా ఫోటోను ఉపయోగించకూడదు..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
తామంతా కలిసి పని చేస్తామని.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఎంపీగా గెలవలేని వ్యక్తి రాహుల్ గాంధీ అని.. ఆయన కూడా తమపై వ్యాఖ్యలు చేస్తాడా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని లేపేందుకు కొన్ని ఛానళ్లు బాగా కష్టపడుతున్నాయని, అయితే మీడియా కథనాలతో ప్రజలను మభ్యపెట్టలేరని కౌంటర్ ఇచ్చారు. రాహుల్కు రాజకీయం నేర్పేందుకు కొన్ని ఛానళ్లు క్లాసులు ఇస్తున్నాయని, కేవలం కాంగ్రెస్ను గెలిపించడానికే ఈ నిర్నయం తీసుకున్నారని చెప్పారు. చచ్చిపోయిన పీనుగులాంటి పార్టీ కాంగ్రెస్ అని, 12 వేల ఓట్లతో గెలిచిన వ్యక్తిని పార్టీలోకి చేర్చుకుంటే అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించారు. జర్నలిజాన్ని జెన్యూన్గా నిర్వహించాలని సూచించారు. తనకు, బండి సంజయ్కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. తప్పు చేసిన వారిని, అవినీతి చేసిన వారిని బొక్కలో వేస్తామని మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైల్ ఆల్ టైం హై రికార్డ్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!