Dharmapuri Arvind : పసుపు పంటపై.. నేను లేఖ రాసిన స్పందించలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ మార్కెట్లో ఈ రోజు పసుపు పంటకు క్వింటాల్ కు 10 వేల రూపాయలు ధర పలికిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పడ్డ అకాల, అతి వర్షాలకు పసుపు పంట చాలా వరకు దెబ్బతిన్నదని ఆయన అన్నారు. పంట కుళ్లి పోయిన రైతులు చాలా వరకూ నష్టపోయారని, అలాంటి పంట తక్కువ ధర పలుకుతుందని, అలాంటి రైతులను ఆదుకోవాలని ఇప్పటికే నేను ముఖ్యమంత్రి కి లేఖ రాయడం జరిగింది. కాని ఇంత వరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆయన విమర్శించారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఫసల్ భీమా యోజనను ప్రారంభించిందన్నారు.
కానీ.. తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఈ పథకానికి తన వాటా ప్రీమియం చెల్లించకపోవడంతో ఇప్పుడు రైతులకు తీరని నష్టం జరుగుతోందన్నారు. ప్రీమియం చెల్లించి ఉంటే ఇప్పుడు రైతులకు భీమా కింద నష్టపరిహారం అందేదన్నారు. అలాగే ధర తగ్గినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులను ఆదుకునే అవకాశం ఉన్నా.. కేంద్రం సహకరిస్తామని చెప్పినా ముఖ్యమంత్రి లేఖ రాయకుండా రైతులను కష్టాల పాలు చేస్తున్నడని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కండ్లు తెరిచి రైతులను తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..